SS Rajamouli : ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ మంచి హిట్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన జక్కన్న త్వరలో మహేష్ బాబుతో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘గుంటూరు కారంస షూటింగ్ లో బిజీ గా వున్నాడు. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నెల చివరికి పూర్తి చేసేయ్యాలని మహేష్ బాబు చాలా క్లియర్ గా వున్నాడు, అందుకే ఈ సినిమాకి ఇప్పుడు గ్యాప్ లేకుండా షూటింగ్ చేసుకుంటూ వెళుతున్నాడు అని తెలిసింది.
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు.. రాజమౌళితో సినిమా చేయనున్నాడు. సాధారణంగా రాజమౌళి ఏ సినిమా అవుట్పుట్ విషయంలో వెనక్కు తగ్గరు . ఎంత లేట్ అయినా ఫర్వాలేదు గానీ అనుకున్న అవుట్పుట్ వచ్చేదాకా అస్సలు వదిలిపెట్టరు. నటీనటులతో తనకు కావాల్సిన విధంగా ఫైనల్ ప్రింట్ తీసుకుంటారు జక్కన్న. ఇకపోతే నటీనటులు సినిమాకు మేజర్ హైలైట్ అయ్యేలా ప్లాన్ చేసుకోవడం రాజమౌళి సక్సెస్ మంత్ర. ఈ క్రమంలోనే మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా కోసం దిమ్మతిరిగే స్కెచ్ వేసుకొని బాలీవుడ్ సహా హాలీవుడ్ యాక్టర్స్ ని రంగంలోకి దించుతున్నారట. అయితే మహేష్ విషయంలో రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు తెలుస్తుంది.
రోజుకి 8 గంటలు జిమ్ చేస్తూ ఆహార డైట్ కూడా ఫాలో అవ్వాలని రాజమౌళి.. మహేష్ బాబుకి సూచించారట. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చిత్రీకరణను పూర్తి చేసే పనిలో ఉన్న మహేశ్ బాబుకు రెండింటిని బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. రెండు సినిమాలకి ఒకే సమయంలో మహేష్ బాబు ఇలా కష్టపడుతుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమా ఏ జానర్లో ఉండబోతోందనే విషయాన్ని కన్ఫర్మ్ చేసిన రాజమౌళి.. అందుకు తగ్గట్లుగా ఓ ప్లాన్ రెడీ చేసుకున్నారట. యాక్షన్ అండ్ అడ్వెంచర్ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ దిగ్గజాలు భాగమయ్యేలా చేసుకుంటున్నారట. ఈ విషయాలను స్వయంగా రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…