Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత ఇటీవల తెగ వార్తలలో నిలుస్తూ వస్తుంది. మయోసైటిస్ అనే వ్యాధి నుండి క్రమంగా కోలుకుంటున్న సమంత ఇప్పుడు తను కమిటైన ప్రాజెక్ట్స్పై దృష్టి సారిస్తుంది. సినిమాల విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఆమె తాజాగా నటించిన సినిమా యశోద . ఈ సినిమా 2022 నవంబర్ 11న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. సమంత నటించిన శాకుంతలం, ఖుషీ వంటి చిత్రాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.అయితే తిరిగి ఫాంలోకి వచ్చిన సమంత.. బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిందట. ఈ క్రమంలోనే ముంబైకి షిఫ్ట్ అవ్వాలని ఫిక్స్ అయిందట.
ఈ సందర్భంగానే సమంతకు సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. సమంత ముంబైలో పదిహేను కోట్లతో ఇళ్లు కొన్నదనే వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సినీ సెలబ్రిటీలు ఉండే ఏరియాలో సమంత ఇల్లు కొన్నదని ఇక హైదరాబాద్కి గుడ్ బై చెప్పి ముంబైలో ఉంటుందనే వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వార్తల్లో ఎంత నిజం ఉన్నది సమంతకే తెలియాలి. సమంత ఇప్పుడు తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని చూస్తోంది. సమంతకు బాగా లేకపోవడం వల్ల విజయ్ దేవరకొండ ఖుషి ఆగిపోయింది. శివ నిర్వాణ కూడా వేరే సినిమాను చూసుకుందామని అనుకున్నాడు. కానీ ఇంతలో సమంత కోలుకోవడం, షూటింగ్లకు ఓకే చెప్పడంతో మళ్లీ ఖుషీ వేగంగా పనులు జరుపుకుంటుంది.
మరోవైపు సిటాడెల్ సెట్లో వరుణ్ ధావన్తో కలిసి సందడి చేస్తూ ఉంటుంది సమంత. సమంత నటించిన శాకుంతలం సినిమాకు అడుగడునా ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన శాకుంతలం చిత్రం.. మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 17న రావాల్సిన ఈ సినిమాను దిల్ రాజు బృందం వాయిదా వేసింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ను మేకర్లు అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…