
పబ్లిక్లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడి సెలబ్రిటీలను వారు ఉక్కిరిబిక్కిరి చేస్తారు. బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు కూడా సరిగ్గా ఇలాంటి సంఘటనే ఎదురైంది. ముంబైలో తాజాగా నిర్వహించిన ఓ పబ్లిక్ ఈవెంట్లో ఆయన పాల్గొనగా అక్కడికి భారీగా చేరుకున్న అభిమానుల కేరింతల నడుమ ఇబ్బందులకు గురయ్యారు. అభిమానుల మధ్య ఆయన ఇరుక్కపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన తాలూకు వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారాయి. అయితే ఈ సంఘటన ఆయనకున్న విపరీతమైన క్రేజ్కు అద్దం పడుతుండగా, మరోవైపు సెలబ్రిటీల భద్రతపై కూడా ఆందోళన కలిగిస్తోంది.
అభిమానులు చుట్టుముట్టడంతో అదుపు తప్పిన పరిస్థితి..
థానేలోని దాదోజి కొండదేవ్ స్టేడియంలో జరిగిన ప్రెసిడెంట్ కప్ 2026 ఈవెంట్కు సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. బ్రౌన్ షర్ట్, బ్లూ జీన్స్తో సాధారణ వేషధారణలో కనిపించిన ఆయన ప్రారంభంలో ప్రశాంతంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కొద్ది సేపటికే పరిస్థితి అదుపు తప్పింది. పెద్ద సంఖ్యలో అభిమానులు ఒక్కసారిగా ఆయన చుట్టూ గుమిగూడడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో సల్మాన్ స్టేడియం నుంచి బయటకు వెళ్లే సమయంలో అన్ని వైపులా అభిమానులు చుట్టుముట్టిన దృశ్యాలు కనిపించాయి. భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ జనాన్ని నియంత్రించడం కష్టంగా మారింది. కొన్ని వీడియోల్లో సల్మాన్ ఖాన్ను పోలీసులు కాన్వాయ్లో బయటకు తీసుకెళ్తున్నట్లు కనిపించగా, భద్రతా బృందాలు అభిమానులను అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమైంది.
View this post on Instagram
అభిమానుల్లో ఆందోళన..
ఈ ఘటనపై అభిమానులు, నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల సల్మాన్ ఖాన్కు వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సరిపోతున్నాయా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే చివరకు సల్మాన్ ఖాన్ సురక్షితంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయినప్పటికీ ఈ ఘటన ఆయనకు ఉన్న విపరీతమైన అభిమానాన్ని, అలాగే ఇలాంటి భారీ జనసమ్మర్థంలో ఉన్న ప్రమాదాలను మరోసారి గుర్తుచేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రం మాతృభూమి విడుదలకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ఆగస్టు 2026లో థియేటర్లలో విడుదల కానుంది. కాగా ఆయన నిర్మాత దిల్ రాజుతో కలిసి మరో ప్రాజెక్ట్పై పనిచేయనున్నారు. తాత్కాలికంగా SVC63గా పిలుస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనుండగా హీరోయిన్గా నయనతార నటించనున్నారు.












