Rishab Shetty : కాంతార.. ఈ కన్నడ చిత్రం కొన్ని నెలల క్రితం చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయం సాధించింది. సౌత్తో పాటు నార్త్లోను ఈ మూవీ రచ్చ చేసింది. ఈ సినిమా ఫ్యాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం విశేషం. కన్నడలో కంటే మిగతా భాషల్లోనే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. కాంతార ఇంత పెద్ద విజయం సాధించడంతో మూవీకి ప్రీక్వెల్ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. కాంతార ఛాప్టర్ 1న టీజర్ ఇటీవల విడుదల కాగా, ఇందులో రిషబ్ లుక్ అందరిని ఆశ్చర్యపరచింది.
కాంతార చిత్రంకి రిషబ్ నటుడిగా, దర్శకుడిగా సత్తా చాటాడు. ఇప్పుడు ప్రీక్వెల్లో కూడా ఆయనే నటిస్తూ తెరకెక్కించనున్నాడు. ఇందుకు గాను కాంతారా ప్రీక్వెల్ కోసం రిషబ్ శెట్టికి ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. కాంతారా సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లు వసూలు చేసినా.. రిషబ్ శెట్టికి దక్కింది మాత్రం కేవలం రూ.4 కోట్లే. ఇప్పుడు ప్రీక్వెల్పై భారీ అంచనాలు నెలకొనడంతో నిర్మాతలు కూడా అతనికి అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. సినిమా రిలీజ్ అయిన తర్వాత లాభాల్లో వాటాగా ఓ 50 కోట్లు ఇస్తారని తెలుస్తోంది. అంటే దాదాపు ప్రభాస్ రేంజ్ లోనే రిషబ్ 100 కోట్ల వరకు వారితోషికం అందుకునే అవకాశం ఉంది.
ఫస్ట్ పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా 450 కోట్ల కు పైగా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా జాక్ పాట్ కొట్టేశారు అనే చెప్పాలి. ఈ సినిమాలో హీరో గానే కాకుండా దర్శకుడిగా కూడా రిషబ్ శెట్టి సరైన న్యాయం చేయడంతో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది. అయితే రిషబ్ శెట్టి ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా అంతకుమించి అనేలా నిర్మించాలని అనుకుంటున్నాడు. హోంబల్ ప్రొడక్షన్ సెకండ్ పార్ట్ ను దాదాపు 200 నుంచి 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…