Prabhas : ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వరదలు వచ్చి భారీ ఎత్తున నష్టం సంభవించిన విషయం విదితమే. ప్రజలు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే తాజాగా పలువురు టాలీవుడ్ హీరోలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందించారు. ఈ క్రమంలోనే వారి సరసన ప్రభాస్ చేరిపోయాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు భారీ విరాళం అందజేశాడు. ఏకంగా రూ.1 కోటిని విరాళంగా అందించాడు. ఇప్పటి వరకు ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లు రూ.25 లక్షల చొప్పున విరాళాలు అందించగా.. వీరందరి కన్నా ప్రభాస్ ఎక్కువ విరాళం అందించడం విశేషం.
గతంలోనూ ప్రభాస్ ఇదేవిధంగా భారీ ఎత్తున విరాళాలు అందజేశాడు. కోవిడ్ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చాడు. తరువాత తెలంగాణలో వచ్చిన వరదలకు సహాయం చేశాడు. గతంలో ఏపీలో వైజాగ్లో వచ్చిన హుదుద్ తుఫాన్కు బాధితులకు అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే భారీ మొత్తంలో మరోమారు ప్రభాస్ విరాళాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నాడు.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. పూజా హెగ్డెతో కలిసి రాధే శ్యామ్ లో నటిస్తుండగా.. ఈ మూవీ జనవరిలో విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ అనే మూవీ చేస్తున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…