Prabhas : ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వరదలు వచ్చి భారీ ఎత్తున నష్టం సంభవించిన విషయం విదితమే. ప్రజలు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే తాజాగా పలువురు టాలీవుడ్ హీరోలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందించారు. ఈ క్రమంలోనే వారి సరసన ప్రభాస్ చేరిపోయాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు భారీ విరాళం అందజేశాడు. ఏకంగా రూ.1 కోటిని విరాళంగా అందించాడు. ఇప్పటి వరకు ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లు రూ.25 లక్షల చొప్పున విరాళాలు అందించగా.. వీరందరి కన్నా ప్రభాస్ ఎక్కువ విరాళం అందించడం విశేషం.
గతంలోనూ ప్రభాస్ ఇదేవిధంగా భారీ ఎత్తున విరాళాలు అందజేశాడు. కోవిడ్ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చాడు. తరువాత తెలంగాణలో వచ్చిన వరదలకు సహాయం చేశాడు. గతంలో ఏపీలో వైజాగ్లో వచ్చిన హుదుద్ తుఫాన్కు బాధితులకు అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే భారీ మొత్తంలో మరోమారు ప్రభాస్ విరాళాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నాడు.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. పూజా హెగ్డెతో కలిసి రాధే శ్యామ్ లో నటిస్తుండగా.. ఈ మూవీ జనవరిలో విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ అనే మూవీ చేస్తున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…