Pindam OTT : కంటెంట్ బాగున్న సినిమాలకి ఓటీటీలోను మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. ఇక అందులోనూ హార్రర్ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఇటీవల కాలంలో లో 2023లోనే బిగ్గెస్ట్ హార్రర్ మూవీగా పిండం తెరకెక్కింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఎంత వణికించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హర్రర్ సినిమాల్లో ది బెస్ట్ హర్రర్ సినిమాగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈసినిమాను నెట్ఫ్లిక్స్.. దక్కించుకుంది. న్యూ ఇయర్ 2024 జనవరి ఫస్ట్ వీక్లో.. స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఆ క్రమంలోనే తమ సోషల్ మీడియా హ్యాండిల్లో హింట్స్ ఇస్తోంది నెట్ ఫ్లిక్స్.
కళాహి మీడియా బ్యానర్పై హారర్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. డిసెంబర్ 15 న రిలీజ్ అయింది. ఆడియెన్స్ను వణింకింది. హిట్ సినిమాగా హిస్టరీ కెక్కింది. నటుడు శ్రీరామ్ చాలా ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా తాజా చిత్రం పిండం. ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. ఓటీటీలో కూడా ఈ మూవీ అదరగొడుతుందని భావిస్తున్నారు.
చిత్ర కథ విషయానికి వస్తే…. ఆంథోని(శ్రీరామ్) ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్ గా పని చేస్తుండగా…. అతని భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో నివసిస్తూ ఉంటాడు. అయితే అది ఓ పురాతమైన ఇల్లు… తక్కువ ధరకు వస్తుందని భావించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తాడు హీరో. అయితే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వారికి ఊహించని సంఘటనలు ఎదురు కాగా… వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనే కథంశంతో తెరకెక్కించారు. మీరు ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయితే కనుక ఓటీటీలో చూసేయండి. కానీ గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఈ సినిమాను చూడొద్దని సెన్సార్ బోర్డు ప్రకటించింది.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…