Muralidharan 800 Movie OTT Release Date : లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ గురించి క్రికెట్ ప్రేమికులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఆయన జీవితం ఆధారం రూపొందిన సినిమా ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) విన్నర్ షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ రాశారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. శ్రీలంకలో సింహళ భాషలో విడుదలైంది. ఈ ఏడాది అక్టోబర్ 6న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలాయళం భాషలతో పాటు శ్రీలంకలో సింహళ భాషలో విడుదలైంది.
చిత్రంలో ముత్తయ్య మురళీధర్ పాత్రలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. అలాగే అతని భార్య పాత్రలో మహిమా నంబియార్ కనిపించారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. ఇక ముత్తయ్య మురళీధర్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించగా.. ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ లభించింది. ఇక ఇప్పుడు ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమా తీసుకున్నట్లు తెలుస్తోంది.
వచ్చే నెల అంటే డిసెంబర్ 2 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని తెలియజేస్తూ జియో సినిమా ట్వీట్ చేసింది. అయితే థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమాకు ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. అయితే ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ మంది థియేటర్లకు రాలేదు. ఆ కారణంగా జియో ఓటీటీలో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. చిత్రంలో ‘అఖండ’, ‘స్కంద’ సినిమాల ఫేమ్ శరత్ లోహితస్య కీలక పాత్ర చేశారు. మురళీధరన్ తన బాల్యంలో శ్రీలంకలో తమిళులపై జరిగిన దాడులు, క్రికెట్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎదురైన అవమానాలు వంటివి చూపించారు. చెన్నైకు చెందిన అమ్మాయిని మురళీధరన్ వివాహం చేసుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…