Bandla Ganesh : బండ్ల గణేష్.. ఒకప్పుడు నిర్మాతగా వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించాడు. విచిత్ర వేషాలతో కూడా ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంటాడు. ఆ మధ్యలో రాజకీయాలకు వెళ్లి మళ్లీ గుడ్ బై అన్నట్టుగా చెప్పాడు. కానీ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేశాడు. ఈ సారి కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు.అయితే బండ్ల గణేష్ హిందూ ఫెస్టివల్స్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. ఆయనకి దీపావళి పండుగ అంటే ఎంతో ఇష్టం. ప్రతి ఏటా ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అందులో భాగంగానే పెద్దె ఎత్తున బాణాసంచా తెప్పించారు.
బాణాసంచాని ఊరందరికి పంచిపెట్టి, ఎంతో సంబరంగా అందరితో కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు బండ్ల గణేష్ . అయితే, ఆయన ఈ సారి మాలలో ఉండి చెప్పులు ధరించి మరీ క్రాకర్స్ కాల్చారు బండ్లగణేష్. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పడు వైరల్గా మారింది. అయ్యప్ప దీక్షలో ఉండి బండ్ల గణేష్ ఇలా కాలికి చెప్పులు వేసుకున్నాడేంటి? అని అందరు షాక్ అవుతున్నారు. అయ్యప్ప మాల చాలా పవిత్రమైనది. దాన్ని ఇలా అపవిత్రం చేయకండి అంటూ కొందరు నెటిజన్లు బండ్లగణేష్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప మాల ధరించి ఇలాంటి పనులు చేయడం తప్పని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఏదిఏమైనా బండ్లగణేష్ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయంపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఆయన కి ఇప్పుడు పవన్తో చెడిందని అంటున్నారు. పవన్.. బండ్లని దూరంగా పెట్టిన కూడా ఆయన ఎప్పుడు కూడా పవన్ వైపే నిలుస్తూ ఆయన గురించి గొప్పగా చెప్పుకొస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…