Meenakshi Chaudhary : హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరు చెబితే ఠక్కున గుర్తుకు రాకపోవచ్చు. హిట్ 2 బ్యూటీ అంటే మాత్రం అందరు ఇట్టే గుర్తు పట్టేస్తారు. తనదైన అందం, నటన, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ భామ ఇటీవలి కాలంలో వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటుంది. తెలుగులో సుశాంత్ తో కలిసి ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాలో కథానాయికగా నటించిన ఈ అందాల భామ ఇందులో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఇందులో మీనాక్షి పర్ఫార్మెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇక రవితేజతో కలిసి ఖిలాడి అనే చిత్రం చేయగా, ఈ మూవీ ఫ్లాప్ కావడంతో మీనాక్షికి పెద్దగా మార్కులు పడలేదు.అనంతరం అడవి శేష్ నటించిన హిట్ 2 చిత్రంలో మీనాక్షి హీరోయిన్ గా నటించింది.
హిట్ 2 సినిమాలో మీనాక్షికి మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా తర్వాతే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న గుంటూరు కారంలో ఛాన్స్ దక్కించుకుంది. మొదట గుంటురు కారం సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడంతో.. మీనాక్షికి అదృష్టం కలిసి వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఆ సినిమాతో ఈ భామ ఫేట్ మారిపోయింది అని చెప్పాలి .గుంటూరు కారం సినమా అవకాశం ఎప్పుడైతే ఈ అమ్మడికి దక్కిందో మీనాక్షికి పెద్ద హీరోల సినిమాల అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడికి గుంటూరు కారం కాకుండా మూడు తెలుగు సినిమాలు, రెండు తమిళ సినిమా అవకాశలు వచ్చినట్టు తెలుస్తుంది.
విశ్వక్ సేన్ నటిస్తున్న ఓ సినిమాలో మీనాక్షి హీరోయిన్ గా ఎంపిక కాగా, వరుణ్ తేజ్ మట్కా సినిమాలోనూ ఈ అమ్మడే కథానాయిక.. ఇక దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమా, సింగపూర్ సెలూన్ అనే తమిళ సినిమాలోను ఈ ముద్దుగుమ్మకి ఛాన్స్ దక్కింది. ఇక ఈ ముద్దుగుమ్మకి అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ దక్కినట్టు టాక్.త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో మీనాక్షి చౌదరిని హీరోయి్ గా ఫిక్స్ చేశారట . మరో హీరోయిన్గా సంయుక్త మీనన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.మరి ఇదే నిజమైతే మాత్రం మీనాక్షి పంట పండినట్టే చెప్పాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…