Mansur Ali Khan : తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ పేరు ఇటీవల వార్తలలో తెగ వినిపించింది. ‘లియో’ మూవీ గురించి మాట్లాడనన ఆయన ఆ సినిమాలో త్రిష నటిస్తున్నారని నాకు తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్న అయితే త్రిషతో నేను చేసే సన్నివేశాలలో ఒక్క సన్నివేశం అయినా బెడ్రూమ్ సీన్ ఉంటుందని ముందుగా ఊహించాను. నా మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని ఎంతో ఆశించాను. కాని దర్శకుడు త్రిషని నాకు చూపించలేదు. గతంలో నేను ఎన్నో రేప్ సీన్స్ చేశాను. అవి నాకు కొత్త కాదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు మన్సూర్.ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. త్రిష కు మద్దతుగా చిరంజీవి, ఖుష్బూ, లోకేష్ కనగరాజ్, నటి మాళవిక మోహన్, చిన్మయి, హీరో నితిన్ తదితరులు ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
మన్సూర్ వ్యాఖ్యలపై త్రిష కూడా స్పందిస్తూ.. తన కెరీర్లో మిగతా సినిమాలలో అతను లేకుండా ఉండేలా చూసుకుంటానని, స్త్రీలను అగౌరవించే విధంగా, లైంగికంగా వేధించే విధంగా, అసహ్యంగా అతని మాటలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక త్రిష వ్యాఖ్యలకు మద్దతునిస్తూ చిరంజీవి, ఖుష్బూ వంటి పలువురు నటులు మన్సూర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నడిగర్ సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఆయన క్షమాపణ చెప్పాలని అన్నారు. కాని మన్సూర్ మాత్రం క్షమాపణలు చెప్పేదే లేదని తేల్చి చెప్పారు. అయితే, పరిస్థితి తీవ్రత నేపథ్యంలో త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ వివాదం అంతా ముగిసింది అనుకుంటున్న సమయంలో మరోసారి ఈ గొడవ కొత్త రూపం సంతరించుకుంది.
త్రిషకి క్షమాపణలు చెప్పిన తర్వాతి రోజు తనని అవమానించిన క్రమంలో త్రిషకు, ఖుష్బూ, చిరంజీవిలకు పరువునష్టం కింద నోటీసులు పంపిస్తున్నానంటూ మన్సూర్ కామెంట్ చేశారు. ఆయన చెప్పినట్టుగానే త్రిషకు, ఖుష్బూ, చిరంజీవిలపై శుక్రవారం మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన లాయర్ ధనంజయన్ ద్వారా కోటి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్లో కోరారు. ఇక ఈ పిటిషన్లో వీడియో మొత్తం చూడకుండా తన పరువుకు భంగం కలిగించారని మన్సూర్ అలీఖాన్ స్పష్టం చేశాడు. డిసెంబర్ 11న మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ ధర్మాసనం ముందుకి ఈ కేసు విచారణకు రానుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…