Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.ఆయన ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నాడు.స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్తో చేస్తున్నారు. గుంటూరు కారం అంటూ వస్తోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుందని ప్రకటించారు.
మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి తప్పక సమయం కేటాయిస్తాడు. ఆయనతో రెగ్యులర్గా వాళ్లతో విదేశాలకి వెళుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. తన భార్య నమ్రతతో పాటు తన ఇద్దరు పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. మహేష్ ది ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం. ఆయన తన ఫ్యామిలీ కోసమే కాక సమాజం కోసం చాలా చేశాడు. తను కొన్ని గ్రామాలని దత్తత తీసుకున్నాడు. అలానే చాలా మందికి అవసరం వచ్చినప్పుడు తనవంతు సాయం చేస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా మహేష్ బాబు గురించి ఒక వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది.
మహేష్ స్కూలింగ్ చేస్తున్నప్పుడు ఆయనకి మార్కులు చాలా తక్కువ వచ్చేవట. ఆయన కృష్ణ తనయుడు కావడంతో ఉపాధ్యాయులు కూడా మహేష్ను గారాబం చేసేవారు. మార్కులు తక్కువ వచ్చినా ఏమీ అనేవారు కాదట. మహేష్కి గారాబం ఎక్కువ కావడంతో చదువు సరిగ్గా అబ్బలేదు. అయితే పదో తరగతిలో కూడా అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదు. సినిమాల వల్ల కొడుకు చదువు ఎక్కడ పాడైపోతుందో అన్న భయంతో మహేష్ని మందలించాడట. అయిన కూడా పదో తరగతిలో అనుకున్న మార్కులు రాలేదు. ఇష్టమైన లయోలా కాలేజీలో ఇంటర్ చదివేందుకు మహేష్కు అడ్మిషన్ కూడా రాలేదట. డిగ్రీలో అయిన సీటు సంపాదించుకోవాలని ఇంటర్లో కష్టపడి చదవగా, మంచి మార్కులు రావడంతో తాను అనుకున్నట్టుగానే లయోలా డిగ్రీ కాలేజీలో బీకాం సీటు సాధించాడు. ఆ సమయంలో మహేష్కి సినిమాలపై ఆసక్తి పెరగడంతో తిరిగి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…