Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.ఆయన ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నాడు.స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్తో చేస్తున్నారు. గుంటూరు కారం అంటూ వస్తోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుందని ప్రకటించారు.
మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి తప్పక సమయం కేటాయిస్తాడు. ఆయనతో రెగ్యులర్గా వాళ్లతో విదేశాలకి వెళుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. తన భార్య నమ్రతతో పాటు తన ఇద్దరు పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. మహేష్ ది ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం. ఆయన తన ఫ్యామిలీ కోసమే కాక సమాజం కోసం చాలా చేశాడు. తను కొన్ని గ్రామాలని దత్తత తీసుకున్నాడు. అలానే చాలా మందికి అవసరం వచ్చినప్పుడు తనవంతు సాయం చేస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా మహేష్ బాబు గురించి ఒక వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది.
మహేష్ స్కూలింగ్ చేస్తున్నప్పుడు ఆయనకి మార్కులు చాలా తక్కువ వచ్చేవట. ఆయన కృష్ణ తనయుడు కావడంతో ఉపాధ్యాయులు కూడా మహేష్ను గారాబం చేసేవారు. మార్కులు తక్కువ వచ్చినా ఏమీ అనేవారు కాదట. మహేష్కి గారాబం ఎక్కువ కావడంతో చదువు సరిగ్గా అబ్బలేదు. అయితే పదో తరగతిలో కూడా అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదు. సినిమాల వల్ల కొడుకు చదువు ఎక్కడ పాడైపోతుందో అన్న భయంతో మహేష్ని మందలించాడట. అయిన కూడా పదో తరగతిలో అనుకున్న మార్కులు రాలేదు. ఇష్టమైన లయోలా కాలేజీలో ఇంటర్ చదివేందుకు మహేష్కు అడ్మిషన్ కూడా రాలేదట. డిగ్రీలో అయిన సీటు సంపాదించుకోవాలని ఇంటర్లో కష్టపడి చదవగా, మంచి మార్కులు రావడంతో తాను అనుకున్నట్టుగానే లయోలా డిగ్రీ కాలేజీలో బీకాం సీటు సాధించాడు. ఆ సమయంలో మహేష్కి సినిమాలపై ఆసక్తి పెరగడంతో తిరిగి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాడు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…