Kiara Advani : కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలిన కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా జంట ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 7న జైసల్మేర్లోని సూర్యగర్హ్ ప్యాలేస్లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో పాటు బాలీవుడ్లోని పలువురు సినీ సెలబ్రెటీలు వీరి పెళ్లికి హాజరయ్యారు. అనంతరం ప్రేమజంట గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించింది. ముంబైలోని సెయింట్ రెజిస్ హోటల్లో రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వెడుకకు బాలీవుడ్ సెలబ్రెటీలు తరలి వచ్చారు. ఇక ఇప్పుడు కియారా అద్వానీ- సిద్ధార్థ్ పెళ్లి, రిసెప్షన్ వేడుకలకి సంబంధించిన ఫొటోలు తెగ హల్చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు, సినీ క్రిటిక్గా చెప్పుకునే కేఆర్కే వీరి గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతుంది. “ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ కొత్త సంప్రదాయం నడుస్తోంది. అదే ఏమిటంటే.. మొదట ప్రెగ్నెంట్ అయ్యాక.. ఆ తరువాతనే పెళ్లి చేసుకుంటున్నారు. . తాజాగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట కూడా ఈ ట్రెండ్ నే ఫాలో అయింది” అంటూ కేఆర్కే సంచలన ట్వీట్ చేశాడు. అయితే తన ట్వీట్ లో ఆ జంట ఎవరు అనేది మాత్రం చెప్పకపోవడంతో కేఆర్ కే ట్వీట్ పై నెటిజన్లు పలు రకాల ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఇటీవలే వివాహం చేసుకుంది కియారా అద్వానీ, సిద్దార్థ్ కాబట్టి వారిని ఉద్దేశించే అతడు ఆ ట్వీట్ చేశాడా అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఆలియా భట్ ఇలానే గర్భం దాల్చాక పెళ్లి చేసుకుందనే వార్తలు విన్నాం. అన్నట్లుగానే పెళ్లి చేసుకున్న కొన్ని నెలల్లోనే బిడ్డకు జన్మనిచ్చి ఆశ్చర్యపరిచింది ఆలియా. ఈ ఇష్యూ జనాల్లో ఎంతో పెద్ద డిస్కషన్ పాయింట్ అయింది. అయితే ఇప్పుడు కియారా కూడా అదే బాటలో వెళుతుందన్నట్లు టాక్ రావడం గమనార్హం. మరి దీనిపై కియారా దంపతులు ఏమైన స్పందిస్తారా అన్నది చూడాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…