Kiara Advani : కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలిన కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా జంట ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 7న జైసల్మేర్లోని సూర్యగర్హ్ ప్యాలేస్లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో పాటు బాలీవుడ్లోని పలువురు సినీ సెలబ్రెటీలు వీరి పెళ్లికి హాజరయ్యారు. అనంతరం ప్రేమజంట గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించింది. ముంబైలోని సెయింట్ రెజిస్ హోటల్లో రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వెడుకకు బాలీవుడ్ సెలబ్రెటీలు తరలి వచ్చారు. ఇక ఇప్పుడు కియారా అద్వానీ- సిద్ధార్థ్ పెళ్లి, రిసెప్షన్ వేడుకలకి సంబంధించిన ఫొటోలు తెగ హల్చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు, సినీ క్రిటిక్గా చెప్పుకునే కేఆర్కే వీరి గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతుంది. “ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ కొత్త సంప్రదాయం నడుస్తోంది. అదే ఏమిటంటే.. మొదట ప్రెగ్నెంట్ అయ్యాక.. ఆ తరువాతనే పెళ్లి చేసుకుంటున్నారు. . తాజాగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట కూడా ఈ ట్రెండ్ నే ఫాలో అయింది” అంటూ కేఆర్కే సంచలన ట్వీట్ చేశాడు. అయితే తన ట్వీట్ లో ఆ జంట ఎవరు అనేది మాత్రం చెప్పకపోవడంతో కేఆర్ కే ట్వీట్ పై నెటిజన్లు పలు రకాల ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఇటీవలే వివాహం చేసుకుంది కియారా అద్వానీ, సిద్దార్థ్ కాబట్టి వారిని ఉద్దేశించే అతడు ఆ ట్వీట్ చేశాడా అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఆలియా భట్ ఇలానే గర్భం దాల్చాక పెళ్లి చేసుకుందనే వార్తలు విన్నాం. అన్నట్లుగానే పెళ్లి చేసుకున్న కొన్ని నెలల్లోనే బిడ్డకు జన్మనిచ్చి ఆశ్చర్యపరిచింది ఆలియా. ఈ ఇష్యూ జనాల్లో ఎంతో పెద్ద డిస్కషన్ పాయింట్ అయింది. అయితే ఇప్పుడు కియారా కూడా అదే బాటలో వెళుతుందన్నట్లు టాక్ రావడం గమనార్హం. మరి దీనిపై కియారా దంపతులు ఏమైన స్పందిస్తారా అన్నది చూడాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…