Japan OTT Release Date : ఇప్పుడు తమిళంతో పాటు ఇతర భాషలకి చెందిన హీరోలని కూడా మన తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకుంటున్నారు. వారి సినిమాలని ఎంతగానో ఆదరిస్తున్నారు. ఏ భాషకి చెందిన హీరో అయిన మంచి ఎంటర్ టైన్మెంట్ సినిమా అంటే తప్పక అక్కున చేర్చుకుంటున్నారు. ఖైదీ సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేసిన కోలీవుడ్ హీరో కార్తీ ఇప్పుడు అదే జోష్ తో జపాన్ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిల్చింది. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి హైప్ పై రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులని అంతగా అలరించలేకపోయింది.
నటన పరంగా కార్తీ తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ, ప్రేక్షకులకు మాత్రం ఈ మూవీ అంతగా కనెక్ట్ కాలేదు. దీంతో థియేటర్ల నుంచి తొందరగానే వెళ్లిపోయిన ఈ చిత్రం వెండితెరపై వచ్చి నెలరోజులు గడవకముందే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. జపాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. జపాన్ సినిమా భారీ అంచనాలతో విడుదలై నిరాశ మిగిల్చిడంతో..ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. తాజాగా ఓటీటీ రిలీజ్పై అఫీషియల్ ప్రకటన రాగా, డిసెంబర్ 11 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో జపాన్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. హిందీకి సంబంధించి ప్రకటన రాలేదు.
కార్తీ కెరీర్లో 25వ సినిమాగా వచ్చిన జపాన్ చిత్రంలో టాలీవుడ్ కమెడియన్ సునీల్ కీలక పాత్ర పోషించాడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు. డైరెక్టర్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది.ఈసినిమాలో హీరో కార్తీకి బంగారం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ దొంగతనాలు చేస్తూ ఆ డబ్బుతో జల్సాగా జీవించే అతను ఉన్నట్లుండి అతడు రూ.200 కోట్ల విలువైన బంగారం దొంగతనం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. చేయని నేరం నుంచి కార్తీ ఎలా తప్పించుకున్నాడనేది జపాన్ చిత్రం. థియేటర్లో మిస్ అయిన వారు ఈ మూవీని ఓటీటీలో చూసి ఫుల్గా ఎంజాయ్ చేయండి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…