Guntur Karam : సాధారణంగా హీరోలకి సరిపోయేలా దర్శకులు కథలను సిద్ధం చేస్తూ ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఏదో కారణాల వలన ఆ కథలని వేరే హీరో రిజెక్ట్ చేయడం, ఆ కథతో ఇంకో హీరో సినిమా చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అలా జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అలా ఎక్కువ హిట్ సినిమాలను వదులుకున్నారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న గుంటూరు కారం. ఈ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో గురూజీ మొదట టాలీవుడ్ స్టార్ హీరోను అనుకున్నారట. ఆయన వివిధ కారణాల వలన ఈ సినిమాను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.
గుంటూరు కారం సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడు కాగా, ఇప్పటికే వీరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. ఇక ఈ సినిమా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. చిత్రంలో మహేశ్ బాబు సరసన మొదట పూజా హెగ్డే అనుకున్నారు మేకర్స్. అయితే ఆమె తప్పుకోవడం.. ఈ సినిలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాను మొదట ఓ టాలీవుడ్ స్టార్ హీరో చేయాల్సి ఉండేనట. అయితే ఆయన రిజెక్ట్ చేయడం వల్లే ఈ సినిమా మహేశ్ బాబు చేతుల్లోకి వెళ్లిందని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. గుంటూరు కారం సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మొదట పవన్ కళ్యాణ్ తో చేయాలి అనుకున్నారట. ఆయనకు కథ కూడా చెప్పారని తెలుస్తోంది. అయితే ఆయన రిజెక్ట్ చేయండ వల్లే మహేశ్ బాబు చేతుల్లోకి వెళ్లిందట. అయిష్టంగానే పవన్ కల్యాణ్ గుంటూరు కారం సినిమాను వదులుకున్నారని తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…