Dhee Show : ప్రముఖ డ్యాన్స్ షో ఢీ సక్సెస్ ఫుల్గా కొనసాగుతోంది. రీసెంట్గా ఢీ 13 ఫినాలే జరగగా ఇందులో కావ్యశ్రీ విజేతగా నిలిచింది. అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకుంది. ఇక ఇప్పుడు రాబోయే సీజన్ ఢీ 14 డ్యాన్సింగ్ ఐకాన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సారి ఢీ జూనియర్స్, ఢీ లేడీస్ స్పెషల్, ఢీ జోడీ, ఢీ ఛాంపియన్స్ అనే నాలుగు టీమ్లతో షో ప్లాన్ చేయబడింది. రీసెంట్గా విడుదలైన ప్రోమోను చూస్తుంటే పలు మార్పులతో షో ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
యాంకర్గా ప్రదీప్.. టీమ్ లీడర్లుగా హైపర్ ఆది, ‘బిగ్బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ కనిపించారు. జడ్జిలుగా ప్రియమణి, గణేష్ మాస్టర్ ఉన్నారు. తొలి ఎపిసోడ్కు ‘లక్ష్య’ హీరో హీరోయిన్లు నాగశౌర్య, కేతిక శర్మ విచ్చేసి సందడి చేశారు. అలాగే డాన్సర్ తేజస్వినితో కలిసి హిప్ మూవ్మెంట్ చేసిన హైపర్ ఆది తెగ నవ్వించారు. అయితే స్మాల్ స్క్రీన్ జోడీ సుడిగాలి సుధీర్, రష్మి ఇందులో కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
దాదాపు ఐదు సీజన్లలో టీమ్ లీడర్లుగా కనిపించిన సుధీర్ – రష్మీ జంట ప్రోమోలో కనిపించకపోవడంతో వారి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సుధీర్ లేకపోవడంతో రష్మీ కూడా ఈ సీజన్లో కనిపించదని అంటున్నారు. అందుకే ఆమె స్థానంలో మోనాల్ గజ్జర్ ను రంగంలోకి దింపుతున్నారట. ఇతర టీమ్ లీడర్గా దీపికా పిల్లి కొనసాగవచ్చు. బిగ్ బాస్ రొమాన్స్ని ఇక్కడ మరోసారి బుల్లితెర ప్రేక్షకులకి చూపించేందుకు ఢీ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…