తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు ఈ.సత్తి బాబు దర్శకత్వం వహించిన “నేను” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి “అర్చన వేద శాస్త్రి” . శ్రీరామదాసు, పౌర్ణమి, సామాన్యుడు, యమదొంగ, ఖలేజా వంటి సినిమాలతో పాటు బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. ఈమె అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలియజేస్తుంది. తాజాగా అర్చన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అమ్మాయిలని ట్రాప్ చేయాలని కొంతమంది హీరోలు ఉంటారని. మైండ్ ని క్యాప్చర్ చేయడానికి చూస్తారంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఎవరైన అమ్మాయి కాస్త వీక్ గా ఉంటే.. ఆ అమ్మాయి మైండ్ ని క్యాప్చర్ చేయడానికి కొంతమంది జనాలు ఉంటారని ఆమె అన్నారు. అందుకే అమ్మాయిలు వీక్ కాకూడదు. ఏడిస్తే వీక్ అనడం కరెక్ట్ కాదు. ఏడుపుకి, వీక్ కి సంబంధం లేదని అన్నారు. తనను కూడా వీక్ అనుకుని ఒక హీరో ట్రాప్ చేయాలని చూశాడని అతను మనకి బాగా తెలిసిన వ్యక్తే. మరీ ఎక్కువ సక్సెస్ కలిగిన హీరో కాదు. ఆయన నాకు తెలియకుండా నా వెనకాల నీచమైన మాటలు కూడా మాట్లాడాడట.అతని మాటలకు వేరే వాళ్లు అయితే చాలా బాధపడేవారు. అయితే అందంగా ఉండి బ్యాక్ గ్రౌండ్ పెద్దగా లేని అమ్మాయిలని వారి మైండ్ ని క్యాప్చర్ చేయడానికి ఇలాంటి వ్యక్తులు ఉన్నారని కామెంట్స్ చేశారు.
మనకు మంచిది అనేది ముందే తెలుస్తుంది. మనకి సెట్ కాని పరిస్థితుల్లో కొందరు వీక్ అవుతారు. అలాంటి వారికి చేదు అనుభవాలు ఎదురవుతాయని..అలాంటివి ఏ అమ్మాయికైనా, అబ్బాయికైనా జరగకూడదని అర్చన అన్నారు. తనకి ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారని.. అతని ఉద్దేశం ఏంటో తెలుసుకోగలిగానని ఆమె అన్నారు. రాధాగోపాలం సినిమాలో అవకాశాన్ని మిస్ చేసుకున్నానని చెప్పుకొచ్చిన ఈ భామ అందులో నటించి ఉంటే కెరీర్ మరోలా ఉండేదని చెప్పుకొచ్చింది. రంగస్థలం సినిమాలో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్ర తనను ఎంతగానో మెస్మరైజ్ చేసినట్టు చెప్పుకొచ్చింది అర్చన.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…