తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు ఈ.సత్తి బాబు దర్శకత్వం వహించిన “నేను” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి “అర్చన వేద శాస్త్రి” . శ్రీరామదాసు, పౌర్ణమి, సామాన్యుడు, యమదొంగ, ఖలేజా వంటి సినిమాలతో పాటు బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. ఈమె అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలియజేస్తుంది. తాజాగా అర్చన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అమ్మాయిలని ట్రాప్ చేయాలని కొంతమంది హీరోలు ఉంటారని. మైండ్ ని క్యాప్చర్ చేయడానికి చూస్తారంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఎవరైన అమ్మాయి కాస్త వీక్ గా ఉంటే.. ఆ అమ్మాయి మైండ్ ని క్యాప్చర్ చేయడానికి కొంతమంది జనాలు ఉంటారని ఆమె అన్నారు. అందుకే అమ్మాయిలు వీక్ కాకూడదు. ఏడిస్తే వీక్ అనడం కరెక్ట్ కాదు. ఏడుపుకి, వీక్ కి సంబంధం లేదని అన్నారు. తనను కూడా వీక్ అనుకుని ఒక హీరో ట్రాప్ చేయాలని చూశాడని అతను మనకి బాగా తెలిసిన వ్యక్తే. మరీ ఎక్కువ సక్సెస్ కలిగిన హీరో కాదు. ఆయన నాకు తెలియకుండా నా వెనకాల నీచమైన మాటలు కూడా మాట్లాడాడట.అతని మాటలకు వేరే వాళ్లు అయితే చాలా బాధపడేవారు. అయితే అందంగా ఉండి బ్యాక్ గ్రౌండ్ పెద్దగా లేని అమ్మాయిలని వారి మైండ్ ని క్యాప్చర్ చేయడానికి ఇలాంటి వ్యక్తులు ఉన్నారని కామెంట్స్ చేశారు.
మనకు మంచిది అనేది ముందే తెలుస్తుంది. మనకి సెట్ కాని పరిస్థితుల్లో కొందరు వీక్ అవుతారు. అలాంటి వారికి చేదు అనుభవాలు ఎదురవుతాయని..అలాంటివి ఏ అమ్మాయికైనా, అబ్బాయికైనా జరగకూడదని అర్చన అన్నారు. తనకి ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారని.. అతని ఉద్దేశం ఏంటో తెలుసుకోగలిగానని ఆమె అన్నారు. రాధాగోపాలం సినిమాలో అవకాశాన్ని మిస్ చేసుకున్నానని చెప్పుకొచ్చిన ఈ భామ అందులో నటించి ఉంటే కెరీర్ మరోలా ఉండేదని చెప్పుకొచ్చింది. రంగస్థలం సినిమాలో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్ర తనను ఎంతగానో మెస్మరైజ్ చేసినట్టు చెప్పుకొచ్చింది అర్చన.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…