‘భూత్ బంగ్లా’ కోసం అక్షయ్ కుమార్ పూజలు.. అత్త డింపుల్‌తో కలిసి మహాకాళ్ దర్శనం!

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ చిత్రం ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

April 1, 2026 3:36 PM
Akshay Kumar and Dimple Kapadia offering prayers at Mahakaleshwar temple.
ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో శివుడికి జలాభిషేకం నిర్వహిస్తున్న నటుడు అక్షయ్ కుమార్, డింపుల్ కపాడియా. Photo Credit: NDTV/Instagram.

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ చిత్రం ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందు అక్షయ్ కుమార్ తన అత్త డింపుల్ క‌పాడియాతో కలిసి మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించి శివుడి ఆశీస్సులు తీసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో అక్షయ్ కుమార్, డింపుల్ కపాడియా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు కనిపించారు. అక్షయ్ సంప్రదాయ తెలుపు దుస్తుల్లో కనిపించగా, డింపుల్ గులాబీ రంగు చీరలో దర్శనమిచ్చారు. ఒక వీడియోలో ఇద్దరూ కలసి జలాభిషేకం కోసం నీటితో నిండిన పాత్రను పట్టుకుని పూజలు చేస్తుండగా, మరొక వీడియోలో అక్షయ్ నంది విగ్రహం ఎదుట‌ నమస్కరిస్తూ తన కోరికలను చెవిలో చెప్పడం కనిపించింది.

 

View this post on Instagram

 

A post shared by NDTV (@ndtv)

గ‌తంలో అక్ష‌య్‌పై డింపుల్ వ్యాఖ్య‌లు..

అక్షయ్ కుమార్, డింపుల్ కపాడియా మధ్య మంచి అనుబంధం ఉన్నప్పటికీ ప్రారంభంలో పరిస్థితి అంత సాఫీగా లేదని గతంలో వెల్లడైంది. తన కుమార్తె ట్వింకిల్ ఖ‌న్నా అక్షయ్‌ను వివాహం చేసుకోవడంపై మొదట్లో సందేహాలు ఉన్నాయని డింపుల్ గ‌తంలో చెప్పారు. 2024లో ఫిక్కి ఫ్లో జైపూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మొదట్లో త‌న కుమార్తె అతన్ని పెళ్లి చేసుకోవడంపై త‌న‌కు సందేహాలు ఉండేవ‌ని, కానీ ఇప్పుడు చూస్తే అతను ఎంతో క్రమశిక్షణ గల వ్యక్తిగా ఉన్నాడ‌ని అన్నారు. అతను ఒక గొప్ప మనిష‌ని, చాలా సాధారణంగా అందరితో కలిసిపోతాడ‌ని, అతని సరదా స్వభావం చాలా ప్రత్యేకం అని అన్నారు.

అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా 2001లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరవ్ అనే కుమారుడు, నితారా అనే కుమార్తె ఉన్నారు. ఇక భూత్ బంగ్లా చిత్రంలో ప‌రేష్ రావ‌ల్‌, రాజ్‌పాల్ యాద‌వ్‌, ట‌బు, వామికా గ‌బ్బి, జిష్షు సేన్‌గుప్తా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని బాలాజీ మోష‌న్ పిక్చ‌ర్స్‌, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment