Akhil : అమ్మాయి పుడుతుందని అనుకున్న నాగార్జునకు అఖిల్ పుట్టడంతో షాక్ అయ్యారట..!

October 17, 2021 3:09 PM

Akhil : అక్కినేని వారసుడు అఖిల్ లేటెస్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. పూజా హెగ్దే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. అమ్మకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నాన్న అమెరికాలో టెస్టులు చేయించారట.

Akhil comments on his birth secret revealed

అలా టెస్టులు చేశాక.. అక్కడి డాక్టర్లు కడుపులో ఉన్నది అమ్మాయని అన్నారట. ఆ మాట వినగానే నాన్న చాలా హ్యాపీగా ఫీలయ్యారని అఖిల్ అన్నారు. ఫస్ట్ నుండి నాన్నకి ఆడపిల్లలంటే ఇష్టం. అందుకే అమ్మాయే పుట్టాలని అనుకున్నారు. వెంటనే అమ్మాయికి సంబంధించిన డ్రెస్ లు కొనేశారట. అమ్మాయికి నికిత అనే పేరుని కూడా నాగ్ డిసైడ్ చేశారట. ఆఖరికి ఇండియాకి టికెట్స్ బుక్ చేసినప్పుడు నికిత అనే పేరుని ఎంటర్ చేశారట.

కానీ డెలివరీ అయ్యాక పుట్టింది అబ్బాయి అని తెలిసి.. నాగార్జున షాక్ అయ్యారని అఖిల్ తన మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికి గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటారట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా తర్వాత అఖిల్ ఏజెంట్ సినిమాలో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం లుక్ పరంగా.. బాడీని బిల్డ్ చేయడానికి చాలా కష్టం అని అన్నారు. దాదాపు ఏడాదిన్నరగా వర్క్ చేశానని అన్నారు. ఈ లుక్ ఆడియన్స్ కి కచ్చితంగా నచ్చుతుందని అన్నారు. అలాగే సురేందర్ రెడ్డి టేకింగ్ కూడా అద్భుతంగా వస్తుందని అఖిల్ అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now