SBI Recruitment 2021 : డిగ్రీ చ‌దివిన వారికి ఆఫ‌ర్‌.. ఎస్‌బీఐలో జాబ్స్‌..!

SBI Recruitment 2021 : దేశంలోనే అతి పెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ ఎప్ప‌టిక‌ప్పుడు ఉద్యోగాల‌కు సంబంధిచిన నోటిఫికేష‌న్స్‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే తాజాగా డిగ్రీ పాసైన వారికి జాబ్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. 1226కు పైగా స‌ర్కిల్‌ బేస్డ్ ఆఫీస‌ర్స్ పోస్టుల‌కు గాను ఎంపిక ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. ఈ క్ర‌మంలోనే ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఎస్‌బీఐ స‌ర్కిల్ బేస్డ్ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీలో భాగంగా దేశ‌వ్యాప్తంగా మొత్తం 1226 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్య‌ర్థుల‌కు వేత‌నం రూ.36,100 నుంచి రూ.63,840 వ‌ర‌కు ల‌భిస్తుంది. ఏదైనా బ్యాచిల‌ర్ డిగ్రీలో ఉత్తీర్ణులు అయి ఉండాలి. డిసెంబ‌ర్ 1, 2021 నాటికి ఏదైనా షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో కనీసం రెండేళ్లు ప‌ని చేసి ఉండాలి. అలాగే డిసెంబర్‌ 1, 2021 నాటికి 21-30 సంవత్సరాల వ‌యస్సును క‌లిగి ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎస్‌బీఐ సీబీవో ఆఫీస‌ర్ పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను 3 ద‌శ‌ల్లో ఎంపిక చేస్తారు. రాత ప‌రీక్ష‌, స్క్రీనింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. దీన్ని నాలుగు విభాగాల్లో మొత్తం 120 మార్కులకు నిర్వ‌హిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు-30 మార్కులు, బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు- 40 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌/ఎకానమీ 30 ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 20 ప్రశ్నలు-20 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షకు 2 గంట‌ల స‌మ‌యం కేటాయించారు.

ఇక రాత పరీక్షలో భాగంగానే ఆబ్జెక్టివ్‌ పరీక్ష ముగిసిన తర్వాత మరో 30 నిమిషాల వ్యవధిలో ఇంగ్లిష్‌ భాషపై 50 మార్కులకు డిస్క్రిప్టివ్‌ పరీక్ష నిర్వహి స్తారు. ఈ డిస్క్రిప్టివ్‌ పరీక్షలో భాగంగా అభ్యర్థులు లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌ రాయాల్సి ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల దరఖాస్తు, అనుభవం, ధ్రువపత్రాలను స్కీనింగ్‌ కమిటీ పరిశీలిస్తుంది. సంస్థ కోరుకుంటున్న ఉద్యోగ అనుభవం అభ్యర్థికి ఉందని కమిటీ సంతృప్తి చెందితేనే పర్సనల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తుంది. త‌రువాత రాత పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో పర్సనల్‌ ఇంటర్వ్యూల‌కు ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూకి 50 మార్కులు కేటాయించారు. అభ్యర్థులకు బ్యాంకింగ్‌ రంగంపై ఉన్న ఆసక్తి, సమకాలీన అంశాలపై అవగాహన, బ్యాంకింగ్‌ రంగంపై పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తారు. అభ్యర్థుల‌ను రాత పరీక్ష, ఇంటర్వ్యూల‌లో సాధించిన మార్కులను వెయిటేజీ ఆధారంగా క్రోడీకరించి.. తుది విజేతలను ప్రకటిస్తారు.

రాత పరీక్షలో ప్రతిభకు 75 శాతం వెయిటేజీ, పర్సనల్‌ ఇంటర్వ్యూలో పొందిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పిస్తారు. అంటే..170 మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో పొందిన మార్కులను 75 శాతానికి.. 50 మార్కులకు జరిగే ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను 25 శాతానికి మదింపు చేస్తారు. ఆ తర్వాత తుది విజేతలను ఖరారు చేస్తారు. ఇక సంబంధిత రాష్ట్రానికి చెందిన అధికారిక భాషపై లాంగ్వేజ్‌ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. ఆ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 10వ‌ తరగతి, 12వ తరగతులను సంబంధిత రాష్ట్రానికి చెందిన మాతృ భాషలో చదివి ఉంటే వారికి ఈ లాంగ్వేజ్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగాల‌కు ఎంపికైన వారికి ముందుగా 6 నెలల ప్రొబేషన్‌ ఉంటుంది. ఈ సమయంలో చూపిన ప్రతిభ ఆధారంగా శాశ్వత నియామకం ఖరారు చేస్తారు. ఇలా పూర్తిస్థాయి నియామకం ఖరారైన వారికి జూనియర్‌ మేనేజ్‌ మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌-1 హోదా కల్పిస్తారు. ఆ తర్వాత ప్రతిభ, పనితీరు ఆధారంగా చీఫ్‌ మేనేజర్, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్ వంటి ప‌దోన్న‌తుల‌ను పొంద‌వ‌చ్చు.

మ‌రింత స‌మాచారం..

ఆన్‌లైన్‌లో ఈ ఉద్యోగాల‌కు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఆయా సర్కిళ్ల పరిధిలోని రాష్ట్రాల్లో ఏదైనా ఒక రాష్ట్రంలోని ఖాళీలకే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది: 29.12.2021 కాగా కాల్‌ లెటర్‌: జనవరి 12, 2022 నుంచి ఇస్తారు. ప‌రీక్ష తేదీ: జనవరి 2022లో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ల‌లో ఉంటాయి. ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 2022 రెండో వారం/మూడో వారంలో ఉంటాయి. పర్సనల్‌ ఇంటర్వ్యూ తేదీలు: 2022 మార్చి/ఏప్రిల్ లో ఉంటాయి. మ‌రిన్ని వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://bank.sbi/careers ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM

త్రిష వర్సెస్ పార్థిబన్.. నటి సీరియస్ కౌంటర్! ‘మైక్ ఉంటే ఏదైనా మాట్లాడతారా?’

త‌మిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను న‌టి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేర‌కు త్రిష త‌న…

Monday, 9 March 2026, 3:22 PM

బెంగళూరులో ఎన్టీఆర్ మేనియా.. ఆసుపత్రి ఓపెనింగ్‌లో భారీ తోపులాట, ఎస్కలేటర్ ధ్వంసం!

నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…

Monday, 9 March 2026, 10:01 AM