నిరుద్యోగ అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు చెబుతోంది. స్టేట్ బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి 6100 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో 125 పోస్టులు ఖాళీగా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 100 ఖాళీలు ఉన్నాయి అప్రెంటిస్ యాక్ట్1961 ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఏ రాష్ట్రంలోని అభ్యర్థులు ఆ రాష్ట్రంలోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ విధంగా ఖాళీగా ఉన్నటువంటి ఈ అప్రెంటిస్ పోస్టులకు డిగ్రీ పాసైన అభ్యర్థులు అర్హులు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 2020 ఆగస్టు 31 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసుకుంటారు.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300ల పరీక్ష రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులకు ఎటువంటి పరీక్ష ఫీజు లేదు. ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులకు ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. ప్రతి నెల 15 వేల రూపాయలను స్టయిఫండ్ ఇవ్వనున్నారు. జులై 6వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా జూలై 26 2021 దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ. ఆగస్టు నెలలో ఆన్లైన్ ద్వారా పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఈ https://bank.sbi/web/careers వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…