నిరుద్యోగ అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు చెబుతోంది. స్టేట్ బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి 6100 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో 125 పోస్టులు ఖాళీగా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 100 ఖాళీలు ఉన్నాయి అప్రెంటిస్ యాక్ట్1961 ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఏ రాష్ట్రంలోని అభ్యర్థులు ఆ రాష్ట్రంలోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ విధంగా ఖాళీగా ఉన్నటువంటి ఈ అప్రెంటిస్ పోస్టులకు డిగ్రీ పాసైన అభ్యర్థులు అర్హులు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 2020 ఆగస్టు 31 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసుకుంటారు.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300ల పరీక్ష రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులకు ఎటువంటి పరీక్ష ఫీజు లేదు. ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులకు ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. ప్రతి నెల 15 వేల రూపాయలను స్టయిఫండ్ ఇవ్వనున్నారు. జులై 6వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా జూలై 26 2021 దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ. ఆగస్టు నెలలో ఆన్లైన్ ద్వారా పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఈ https://bank.sbi/web/careers వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…