చైనాలోని వూహాన్లో 2019లో మొదటి సారిగా కరోనా వైరస్ను గుర్తించారు. తరువాత కొన్ని నెలల్లోనే ఆ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసాన్ని సృష్టించింది. ఎన్నో కోట్ల మంది చనిపోయారు. అయితే తాజాగా చైనాలోనే మరో కొత్త ప్రాణాంతక వైరస్ను గుర్తించారు. దాన్నే మంకీ బి వైరస్ (బీవీ)గా పిలుస్తున్నారు. ఈ వైరస్ సోకి అక్కడ ఒక వ్యక్తి మృతి చెందాడు.
బీజింగ్లోని ఓ ఇనిస్టిట్యూట్లో పనిచేస్తున్న 53 ఏళ్ల వెటర్నరీ వైద్యుడికి ఇటీవల మంకీ బి వైరస్ సోకింది. కోతుల శరీర భాగాలపై పరిశోధన చేస్తున్న సమయంలో అతనికి ఆ వైరస్ సోకింది. దీంతో అతనికి తీవ్రమైన వికారం, వాంతులు కలిగాయి. ఆ తరువాత అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మే 27వ తేదీనే అతను చనిపోయినా ఈ వార్త ఆలస్యంగా బయటకు వచ్చింది. సదరు వైరస్ సోకి చనిపోయిన మొదటి వ్యక్తిగా అతన్ని గుర్తించారు. దీన్ని 1932లో తొలిసారిగా గుర్తించారు. తరువాత ఈ కేసు రావడం ఇదే మొదటి సారి. ఈ వైరస్ సోకిన వారు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చనిపోయే అవకాశాలు 80 శాతం వరకు ఉంటాయి. అయితే ఈ వైరస్ గురించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…