Paytm Jobs: కోవిడ్ నేపథ్యంలో ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయిన వారికే కాదు.. ఔత్సాహికులకు కూడా ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎం చక్కని అవకాశాన్ని అందిస్తోంది. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు.. నెలకు రూ.35వేల వరకు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వారికి అద్భుతమైన ఉద్యోగావకాశాలను అందిస్తోంది.
పేటీఎంలో దేశవ్యాప్తంగా ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్లను నియమించుకోనున్నారు. ఈ ఉద్యోగానికి 10వ తరగతి చదివి ఉంటే చాలు. ఇంటర్, డిగ్రీ చదివిన వారు కూడా దరఖాస్తు చేయవచ్చు. దీనికి గాను మొత్తం 20వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవచ్చు.
పేటీఎం నియమించుకునే ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్లు ఉద్యోగం పొందితే నెలకు రూ.35వేలు సంపాదించుకోవచ్చు. వేతనం + కమిషన్ కలిపి ఆ మొత్తం వస్తుంది. మహిళలు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఇక సొంత వాహనం ఉంటే ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ ఉద్యోగులు పేటీఎంకు చెందిన క్యూఆర్ కోడ్, పీఓఎస్ యంత్రాలు, సౌండ్ బాక్స్, వ్యాలెట్, యూపీఐ, పోస్ట్పెయిడ్, రుణాలు, ఇన్సూరెన్స్లు వంటి ఫీచర్లపై వినియోగదారులకు, వ్యాపారులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగులకు వేతనంతోపాటు వారు చేసే ప్రదర్శనను బట్టి కమిషన్ కూడా లభిస్తుంది. ఇక మరిన్ని వివరాలకు https://paytm.com/fse అనే వెబ్సైట్ను సందర్శించవచ్చు.
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…