ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..1184 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

July 18, 2021 12:04 PM

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగలకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల ఖాళీలను పెంచడం కోసం ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుంది. ఇప్పటివరకు వివిధ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి 1184 పోస్టులను గుర్తించారు.ఈ క్రమంలోనే మరికొన్ని పోస్టులను పెంచి ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఆగస్టు నెలలో నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు తెలిపారు.

ఆగస్టు నెలలో నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎన్ని పోస్టులు ఖాళీ అయితే అన్నింటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం ఈ సందర్భంగా తెలిపారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 47 సంవత్సరాలు పెంచాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన వినతులను పరిశీలించి ప్రభుత్వానికి పంపామని తెలిపారు. అదేవిధంగా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మూడు నాలుగు నెలలో నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

గ్రూప్ 1 ఉద్యోగాలకు తప్ప,మిగిలిన ఏ నోటిఫికేషన్‌కూ ఇకపై ప్రిలిమ్స్ ఉండదని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు తెలిపారు. ఇకపై ఏపీపీఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహిస్తూ ఉద్యోగ నియామకాలకు ఏడాదిపాటు కాలం పడుతుంది కనుక ప్రిలిమ్స్ రద్దు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇకపై ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now