ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అమరావతిలోని హైకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన జడ్జిలకు, రిజిస్ట్రార్లకు సహాయకులుగా కోర్టు మాస్టర్లు,పర్సనల్ సెక్రటరీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ దరఖాస్తు ద్వారా హైకోర్టులో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 25 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 21 2021 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
హైకోర్టులో ఖాళీగా ఉన్నటువంటి 25 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అదేవిధంగా ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఇంగ్లిష్, షార్ట్హ్యాండ్ ఎగ్జామ్ (నిమిషానికి 180 పదాలు) అర్హత కలిగి ఉండాలి. ఇంగ్లిష్లో నిమిషానికి 150 పదాలు షార్ట్హ్యాండ్ ఎగ్జామ్లో అర్హత సాధించిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులకు నెలకు 37 వేల రూపాయల జీతం చెల్లిస్తారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 21వ తేదీలోగా, దరఖాస్తును రిజిస్ట్రార్(అడ్మినిస్ట్రేషన్), హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేలపాడు, అమరావతి, గుంటూరు–522237 చిరునామాకు పంపించాలి. ఈ దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ క్రింది వెబ్ సైట్ సంప్రదించవలెను.
https://hc.ap.nic.in/
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…