ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అమరావతిలోని హైకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన జడ్జిలకు, రిజిస్ట్రార్లకు సహాయకులుగా కోర్టు మాస్టర్లు,పర్సనల్ సెక్రటరీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ దరఖాస్తు ద్వారా హైకోర్టులో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 25 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 21 2021 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
హైకోర్టులో ఖాళీగా ఉన్నటువంటి 25 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అదేవిధంగా ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఇంగ్లిష్, షార్ట్హ్యాండ్ ఎగ్జామ్ (నిమిషానికి 180 పదాలు) అర్హత కలిగి ఉండాలి. ఇంగ్లిష్లో నిమిషానికి 150 పదాలు షార్ట్హ్యాండ్ ఎగ్జామ్లో అర్హత సాధించిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులకు నెలకు 37 వేల రూపాయల జీతం చెల్లిస్తారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 21వ తేదీలోగా, దరఖాస్తును రిజిస్ట్రార్(అడ్మినిస్ట్రేషన్), హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేలపాడు, అమరావతి, గుంటూరు–522237 చిరునామాకు పంపించాలి. ఈ దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ క్రింది వెబ్ సైట్ సంప్రదించవలెను.
https://hc.ap.nic.in/
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…