నిరుద్యోగ అభ్యర్థులకు భారత రైల్వే ప్రభుత్వ శాఖ శుభవార్తను తెలియజేసింది. బెంగళూరుకు చెందిన భారత రైల్వే ప్రభుత్వ శాఖ రైల్ వీల్ ఫ్యాక్టరీలో ఖాళీగా ఉన్న 192 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం 50 శాతం పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, సంబంధిత ట్రేడ్లలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఆగస్టు 13వ తేదీకి 24 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెల నెలా స్టయిఫండ్ రూ.12,261 చెల్లించనున్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను అకాడమిక్ మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీనియర్ పర్సనల్ ఆఫీసర్, పర్సనల్ డిపార్ట్మెంట్, రైల్ వీల్ ఫ్యాక్టరీ, యలహంక, బెంగళూరు-560064 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు స్వీకరణకు సెప్టెంబర్ 13 ఆఖరి తేదీ. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు. rwf.indianrailways.gov.in.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…