నిరుద్యోగ అభ్యర్థులకు భారత రైల్వే ప్రభుత్వ శాఖ శుభవార్తను తెలియజేసింది. బెంగళూరుకు చెందిన భారత రైల్వే ప్రభుత్వ శాఖ రైల్ వీల్ ఫ్యాక్టరీలో ఖాళీగా ఉన్న 192 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం 50 శాతం పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, సంబంధిత ట్రేడ్లలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఆగస్టు 13వ తేదీకి 24 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెల నెలా స్టయిఫండ్ రూ.12,261 చెల్లించనున్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను అకాడమిక్ మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీనియర్ పర్సనల్ ఆఫీసర్, పర్సనల్ డిపార్ట్మెంట్, రైల్ వీల్ ఫ్యాక్టరీ, యలహంక, బెంగళూరు-560064 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు స్వీకరణకు సెప్టెంబర్ 13 ఆఖరి తేదీ. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు. rwf.indianrailways.gov.in.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…