దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే. రోజుకు 4 లక్షల కేసులు నమోదవుతున్నాయి. 3వేల మందికి పైగా చనిపోతున్నారు. రాను రాను పరిస్థితులు ఇంకా దారుణంగా మారుతాయని, కోవిడ్ సెకండ్ వేవ్ త్వరలో పీక్ దశకు చేరుకుంటుందని, తరువాత కోవిడ్ థర్డ్ వేవ్ కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్పై జోరుగా చర్చ సాగుతోంది.
అయితే ప్రధాని మోదీ దేశంలో లాక్డౌన్ను పెట్టేది లేదని, ఆ విషయాన్ని రాష్ట్రాలకే వదిలేశామని అన్నారు. లాకడౌన్ అనేది చివరి అస్త్రమని, దాన్ని ప్రయోగించే వరకు పరిస్థితి తేవొద్దని అన్నారు. కానీ ఆ పరిస్థితి వచ్చేసింది. రానున్న రోజుల్లో ఇంకా దారుణంగా పరిస్థితులు మారే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అందువల్ల లాక్డౌన్ను తప్పనిసరిగా విధించాల్సిందేనన్న భావనకు వస్తున్నారు.
దేశంలో లాక్డౌన్ను విధిస్తే తప్ప కోవిడ్ను కట్టడి చేయలేమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. అలాగే అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లను అమలు చేస్తున్నారు. దీంతో మోదీ లాక్ డౌన్ పెట్టాలా, వద్దా అనే విషయాన్ని చర్చిస్తున్నట్లు తెలిసింది. అయితే పరిస్థితులు చేయి దాటిపోయాయి కనుక లాక్డౌన్ పెడితేనే బాగుంటుందని అనుకుంటున్నట్లు సమాచారం. మరి మోదీ ఈ విషయంపై ఏం ప్రకటన చేస్తారో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…