విశ్లేషణ

తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలు చేస్తారా ? సీఎం కేసీఆర్‌ ఏం నిర్ణయం తీసుకోనున్నారు ?

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో దేశంని పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఢిల్లీలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ లాక్‌డౌన్‌ను మరో వారం పాటు పొడిగించారు. మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ లేదు. కానీ దాదాపుగా అలాంటి పరిస్థితే ఉంది. ఇక కర్ణాటకలో తాజాగా 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప నిర్ణయం తీసుకున్నారు. దీంతో అక్కడ 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలు కానుంది. అయితే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోనూ లాక్‌డౌన్‌ విధిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

కోవిడ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణలో మే 1వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను విధిస్తారని ప్రచారం జరుగుతోంది. కొందరు సైంటిస్టులు, వైద్య నిపుణులు, మేథావులు ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను అమలు చేయాలని సూచించారు. అయితే సీఎం కేసీఆర్‌ ఈ విషయంపై ఈ వారంలో నిర్ణయం తీసుకోనున్నారు.

సీఎం కేసీఆర్‌ కోవిడ్‌ బారిన పడిన తరువాత హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న విషయం విదితమే. అయితే కేంద్రం మే 1 నుంచి దేశంలో 18 ఏళ్ల పైబడిన వారికి టీకాలను వేస్తామని చెప్పాక సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని పౌరులకు ఉచితంగా టీకా అందిస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో కోవిడ్‌ కట్టడికి రాత్రి కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే చర్యలు చేపడుతున్నారు. కానీ రాత్రి కర్ఫ్యూ వల్ల పెద్దగా ఉపయోగం లేదని పెరిగిపోతున్న కేసుల సంఖ్యను చూస్తే తెలుస్తుంది. అందువల్ల కేసీఆర్‌ ఈ విషయంపై మరో 3, 4 రోజుల్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

లాక్‌ డౌన్‌ విధించడం, మహారాష్ట్ర తరహా కఠిన ఆంక్షలను అమలు చేయడం లేదా ప్రస్తుతం ఉన్న స్థితినే కొనసాగించడం.. ఈ మూడు విషయాల్లో ఏదో ఒక దాన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను విధించేది లేదని గతంలో సీఎం కేసీఆర్‌ సహా పలువురు మంత్రులు కూడా స్పష్టం చేశారు. కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. కనుక సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ వైపే మొగ్గు చూపే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది. అయితే ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం ఉత్కంఠను కలిగిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM

కేవలం రూ.9,699కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్లౌపంక్ట్ నుంచి అదిరిపోయే లాంచ్!

బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…

Thursday, 22 January 2026, 1:51 PM