సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ క్రమంలోనే హిందువుల ఇంటి ఆవరణంలో తులసి మొక్క దర్శనమిస్తుంది. ఎంతో పవిత్రంగా భావించే ఈ తులసి మొక్కకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పూజలు చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తారు. అయితే శుక్రవారం పూట తులసి మొక్కను పచ్చి పాలతో ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాపార రంగంలో స్థిరపడిన వారు కొన్నిసార్లు వ్యాపారంలో తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విధంగా వ్యాపారంలో అధిక నష్టాలను ఎదుర్కొనేవారు తులసి మొక్కకు శుక్రవారం సాయంత్రం పచ్చి పాలు, స్వీట్లతో పూజ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల క్రమక్రమంగా వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. ఇలా తులసి మొక్కకు నైవేద్యంగా సమర్పించిన పాలు, స్వీట్లు మిగిలితే వాటిని వివాహిత స్త్రీకి దానం చేయడం వల్ల శుభ పరిణామాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.
వ్యాపార రంగంలో నష్టాలు వాటిల్లకుండా ఉండాలంటే ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అలాగే మన ఇంట్లో ఎవరైనా సమస్యలతో సతమతమవుతున్నప్పుడు ఒక ఐదు తులసి ఆకులను ఇత్తడి నీటి కుండలో వేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తీసుకుని ఇంటి లోపల, బయట శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…