Silver Anklets : స్త్రీలు పట్టిలు ధరించడం ఆనాదిగా వస్తున్న భారతీయ సాంప్రదాయం. పాపాయి పుట్టిన నెల రోజులకే కాళ్లకు కడియాల లాంటివైనా వేసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. గళ్ళు గళ్ళున మ్రోగుతూ మువ్వల పట్టీలు వేసుకొని ఆడ పిల్లలు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు అంటుంటారు. అందుకనే అమ్మాయిలు కచ్చితంగా పట్టీలను వేసుకోవాలని చెబుతుంటారు. ఇక అదే అలవాటు కొనసాగుతూనే ఉంటుంది.
అయితే పట్టీలు వెండితో చేసినవి మాత్రమే ఎందుకు ధరిస్తారు. అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు వివాహ సమయంలో కూడా కాలి వేళ్ళకు మెట్టెలు తొడుగుతారు. అవి కూడా వెండివే ఉంటాయి. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది పసిడితో చేసిన పట్టీలను వేసుకుంటున్నారు. అలా బంగారు పట్టిలు ధరించడం శుభప్రదం కాదంటున్నాయి శాస్త్రాలు. పురాణాల పరంగా కూడా దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి.
హిందూ పురాణాల ప్రకారం అయితే బంగారం అంటే లక్ష్మి. లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే ఇష్టం. ఈ క్రమంలో బంగారం కూడా పసుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఆ రంగు వస్తువులను ఎవరూ కాళ్లకు ధరించకూడదు అని పురాణాలు చెబుతున్నాయి. ఇక సైన్స్ పరంగా చూస్తే వెండి శరీరానికి చలువ చేస్తుంది. వెండి పట్టీలను ధరించడం వల్ల నడుము నొప్పి, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ సజావుగా సాగుతూ పాదాల వాపులు రాకుండా ఉంటాయి. అందుకనే మహిళలు తప్పనిసరిగా బంగారు పట్టీలను కాకుండా వెండి పట్టీలనే ధరించాల్సి ఉంటుంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…