Banana : అరటి పండులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు అరటిపండుతో చాలా ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు రోజూ ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. అరటి పండు సంవత్సరం పొడవునా లభ్యం అయ్యి అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. ఈ పండులో ఉండే పోషకాలు, విటమిన్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.
యాపిల్ కంటే అరటి పండులో ఎక్కువ పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటి పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల కంటి చూపు మెరుగుపడడమే కాదు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లను తట్టుకోగలిగే శక్తి లభిస్తుంది. అలాగే కార్బొహైడ్రేట్లు, కాల్షియం, మెగ్నిషియం ఉంటాయి. ఇవన్నీ మనకు ఎంతో మేలు చేస్తాయి. అయితే ఒక మీడియం సైజ్ ఉన్న అరటి పండును తిన్నా చాలు.. మనకు 110 క్యాలరీల శక్తి లభిస్తుంది. అందువల్ల అరటి పండ్లను తింటే లావుగా అయిపోతామేమోనని అందరూ భయపడుతుంటారు. నిజానికి ఈ విషయం కరెక్టే అయినప్పటికీ లావుగా ఉన్న వారు కూడా అరటి పండును నిర్భయంగా తినవచ్చు. అందువల్ల బరువు ఏమీ పెరగరు. కాకపోతే అందుకు ఒక నియమం ఉంటుంది. అదేమిటంటే..
లావుగా ఉన్నవారు రోజుకు ఒక మీడియం సైజ్ అరటి పండును తినవచ్చు. చిన్నవి అయితే రెండు తినవచ్చు. ఇక ఇలా అరటి పండ్లను తింటే ఇతర ఆహారాలను పూర్తిగా మానేయాలి. లేదా రోజూ తీసుకునే పరిమాణం కన్నా కాస్త తగ్గించి తినాలి. ఉదాహరణకు రెండు అరటి పండ్లను తిన్నారనుకుందాం. కనుక రోజూ తినే అన్నం పరిమాణాన్ని కాస్త తగ్గించాలి. సరిపోతుంది. ఇలా అరటి పండ్లను తింటే బరువు పెరగరు. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
అరటి పండ్లలో కాల్షియం ఎక్కువగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అంతేకాక పొటాషియం, కాల్షియం అనేవి శరీరంలోని ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి, కీళ్ల మధ్య శబ్ధం తగ్గించటానికి సహాయపడతాయి. కీళ్లనొప్పులతో బాధపడేవారు ఆహార నియమాలు పాటించడంతోపాటు డాక్టర్ సూచించిన మందులు వాడాలి. అలాగే బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్లు, ఎండు ఖర్జూరాలు వంటివి రెగ్యులర్ గా తీసుకోవాలి.
కీళ్ల నొప్పులు ఉన్నవారు వ్యాయామం కూడా చేయాలి. ఎందుకంటే అధిక బరువు కారణంగా బరువు కీళ్లపై పడి నొప్పులు ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రతి రోజూ కీళ్ల నొప్పులు ఉన్నవారే కాకుండా ప్రతి ఒక్కరూ ఒక అరటి పండు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే లావుగా ఉన్నవారు మాత్రం పైన తెలిపిన విధంగా అరటి పండ్లను ఒక నియమం ప్రకారం తినాలి. దీంతో బరువు పెరుగుతామేమోనని బెంగపడాల్సిన పని ఉండదు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…