Banana : అరటి పండులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు అరటిపండుతో చాలా ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు రోజూ ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. అరటి పండు సంవత్సరం పొడవునా లభ్యం అయ్యి అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. ఈ పండులో ఉండే పోషకాలు, విటమిన్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.
యాపిల్ కంటే అరటి పండులో ఎక్కువ పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటి పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల కంటి చూపు మెరుగుపడడమే కాదు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లను తట్టుకోగలిగే శక్తి లభిస్తుంది. అలాగే కార్బొహైడ్రేట్లు, కాల్షియం, మెగ్నిషియం ఉంటాయి. ఇవన్నీ మనకు ఎంతో మేలు చేస్తాయి. అయితే ఒక మీడియం సైజ్ ఉన్న అరటి పండును తిన్నా చాలు.. మనకు 110 క్యాలరీల శక్తి లభిస్తుంది. అందువల్ల అరటి పండ్లను తింటే లావుగా అయిపోతామేమోనని అందరూ భయపడుతుంటారు. నిజానికి ఈ విషయం కరెక్టే అయినప్పటికీ లావుగా ఉన్న వారు కూడా అరటి పండును నిర్భయంగా తినవచ్చు. అందువల్ల బరువు ఏమీ పెరగరు. కాకపోతే అందుకు ఒక నియమం ఉంటుంది. అదేమిటంటే..
లావుగా ఉన్నవారు రోజుకు ఒక మీడియం సైజ్ అరటి పండును తినవచ్చు. చిన్నవి అయితే రెండు తినవచ్చు. ఇక ఇలా అరటి పండ్లను తింటే ఇతర ఆహారాలను పూర్తిగా మానేయాలి. లేదా రోజూ తీసుకునే పరిమాణం కన్నా కాస్త తగ్గించి తినాలి. ఉదాహరణకు రెండు అరటి పండ్లను తిన్నారనుకుందాం. కనుక రోజూ తినే అన్నం పరిమాణాన్ని కాస్త తగ్గించాలి. సరిపోతుంది. ఇలా అరటి పండ్లను తింటే బరువు పెరగరు. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
అరటి పండ్లలో కాల్షియం ఎక్కువగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అంతేకాక పొటాషియం, కాల్షియం అనేవి శరీరంలోని ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి, కీళ్ల మధ్య శబ్ధం తగ్గించటానికి సహాయపడతాయి. కీళ్లనొప్పులతో బాధపడేవారు ఆహార నియమాలు పాటించడంతోపాటు డాక్టర్ సూచించిన మందులు వాడాలి. అలాగే బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్లు, ఎండు ఖర్జూరాలు వంటివి రెగ్యులర్ గా తీసుకోవాలి.
కీళ్ల నొప్పులు ఉన్నవారు వ్యాయామం కూడా చేయాలి. ఎందుకంటే అధిక బరువు కారణంగా బరువు కీళ్లపై పడి నొప్పులు ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రతి రోజూ కీళ్ల నొప్పులు ఉన్నవారే కాకుండా ప్రతి ఒక్కరూ ఒక అరటి పండు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే లావుగా ఉన్నవారు మాత్రం పైన తెలిపిన విధంగా అరటి పండ్లను ఒక నియమం ప్రకారం తినాలి. దీంతో బరువు పెరుగుతామేమోనని బెంగపడాల్సిన పని ఉండదు.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…