కాసేపు మనం ఆలయానికి వెళ్లి అక్కడ కూర్చుంటే, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది ఆలయాలకి వీలు కుదిరినప్పుడల్లా వెళ్తూ వుంటారు. పండగ సమయంలో, జాతర వేళలో అయితే చాలామంది భక్తులు ఆలయాలకి వెళ్తుంటారు. ఆలయానికి వెళ్ళినప్పుడు, మనం దేవుని దర్శించుకోవడానికి ముందు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము. గుడి చుట్టూ తిరుగుతూ మూడుసార్లు లేదంటే ఐదు సార్లు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే, ప్రదక్షిణలు చేయడానికి వెళుతున్నప్పుడు, దేవాలయం వెనుక భాగాన్ని ముట్టుకోకూడదు.
కానీ, చాలామంది తెలియక పొరపాటు చేస్తూ ఉంటారు. అయితే, ఎందుకు ఆలయ వెనుక భాగాన్ని ముట్టుకోకూడదు..? దాని వెనుక కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలియక చాలామంది ఆలయానికి వెళ్ళినప్పుడు, కొన్ని పొరపాట్లు చేస్తారు. కానీ, ఖచ్చితంగా ఈ నియమాలని పాటించాలి. పొరపాట్లు చేయకుండా ఉంటే, దేవుని అనుగ్రహం కలుగుతుంది. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
ఏ పని మొదలుపెట్టిన విజయం సాధించాలని మనం కోరుకుంటాం. భగవంతుడి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ.. ఆలయంకి వెళ్లి దర్శనం అయిన తర్వాత మన వెన్ను దేవుడికి చూపించకుండా, తిరిగి అలానే వెనక్కి వచ్చేస్తూ ఉంటాము. దేవాలయాన్ని తాకుతూ ప్రదక్షిణలు చేయకూడదు. గుడిలోని వెనుక భాగంలో రాక్షసులు ఉంటారని అంటారు.
అలా చేయడం వలన రాక్షసులని నిద్రలేపినట్లు అవుతుందట. గుడికి వెళ్లి, దేవుడిని ఈ విధంగా మీరు ప్రార్థిస్తే, కచ్చితంగా నెగిటివ్ ప్రభావం మీ పై పడుతుందని పండితులు అంటున్నారు. కాబట్టి, వెనుక వైపు తాకకండి. ప్రదక్షణ సమయంలో గుడిని తాకుతూ ప్రదక్షిణలు చేయొద్దు. అదే విధంగా మనం ఆలయానికి వెళ్ళాక, దర్శనమైన వెంటనే తిరిగి వచ్చేయకూడదు. ఒకసారి ఆలయంలో ఎక్కడైనా కూర్చుని, ఆ తర్వాత రావాలి. ఆలయానికి వెళ్ళిన తర్వాత తీర్థం తాగి, తీర్థం తీసుకున్న చెయ్యిని తలకి రాసుకోకూడదు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే, అంతా మంచే జరుగుతుంది. తప్పులు చేయడం వలన పాపం వస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…