భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధిస్తే కచ్చితంగా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. భగవంతుడి ఆశీస్సులు కలిగి అంతా మంచే జరుగుతుంది. పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలని పాటించాలి. పూజ చేసే సమయంలో నిద్ర, ఆవలింతలు, కన్నీళ్లు, చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది.. అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొంతమంది భగవంతుడిని పూజించేటప్పుడు కన్నీళ్లు, ఆవలింతలు, నిద్ర, తుమ్ములు, చెడు ఆలోచన లాంటివి వస్తూ ఉంటాయి. అయితే అలా జరగడం మంచిదా..? లేదంటే దాని వల్ల ఏమైనా చెడు జరుగుతుందా అనేది చూస్తే.. నిజానికి మనం పూజ ఎందుకు చేస్తామంటే భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం. అలాంటి పూజని ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి. అలా చేయాలంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి.
ఒక్కొక్కసారి మనకి తెలియకుండా మన మనసు వేరే ఆలోచనల వైపు వెళ్తుంది. అలానే పూజ చేసేటప్పుడు ఆవలింతలు రావడం, తుమ్ములు, నిద్ర రావడం వంటివి కూడా జరుగుతుంటాయి. అయితే మొదటి కారణం శరీరానికి సరైన విశ్రాంతి లేకపోవడం వలన ఇలా జరగొచ్చు. కొన్నిసార్లు త్వరగా నిద్ర లేచి పూజ చేసుకోవడం వలన కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. తల భారంగా అనిపించడం, కళ్ళు బరివెక్కినట్లు ఉండడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి.
మన చుట్టూ ఉండే నెగెటివ్ వైబ్రేషన్స్ కూడా కారణం అవ్వచ్చు. ఇలాంటి సమయంలో పూజ త్వరగా ముగించుకుని వచ్చేయండి. లేదంటే ఒకసారి లేచి కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని కొనసాగించొచ్చు. మన మనసు పూజ మీద నిలపలేకపోవడానికి కారణం నెగెటివ్ ఎనర్జీ కూడా అవ్వచ్చు. సాంబ్రాణి, ధూపం వేస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంటిని తుడిచే నీళ్లల్లో పసుపు, రాళ్ల ఉప్పు వేస్తే కూడా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కర్పూరాన్ని, లవంగాలని కలిసి కాల్చితే కూడా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇలా చేయడం వలన నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మనసు పూజ మీద పెట్టడానికి అవుతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…