భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధిస్తే కచ్చితంగా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. భగవంతుడి ఆశీస్సులు కలిగి అంతా మంచే జరుగుతుంది. పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలని పాటించాలి. పూజ చేసే సమయంలో నిద్ర, ఆవలింతలు, కన్నీళ్లు, చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది.. అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొంతమంది భగవంతుడిని పూజించేటప్పుడు కన్నీళ్లు, ఆవలింతలు, నిద్ర, తుమ్ములు, చెడు ఆలోచన లాంటివి వస్తూ ఉంటాయి. అయితే అలా జరగడం మంచిదా..? లేదంటే దాని వల్ల ఏమైనా చెడు జరుగుతుందా అనేది చూస్తే.. నిజానికి మనం పూజ ఎందుకు చేస్తామంటే భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం. అలాంటి పూజని ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి. అలా చేయాలంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి.
ఒక్కొక్కసారి మనకి తెలియకుండా మన మనసు వేరే ఆలోచనల వైపు వెళ్తుంది. అలానే పూజ చేసేటప్పుడు ఆవలింతలు రావడం, తుమ్ములు, నిద్ర రావడం వంటివి కూడా జరుగుతుంటాయి. అయితే మొదటి కారణం శరీరానికి సరైన విశ్రాంతి లేకపోవడం వలన ఇలా జరగొచ్చు. కొన్నిసార్లు త్వరగా నిద్ర లేచి పూజ చేసుకోవడం వలన కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. తల భారంగా అనిపించడం, కళ్ళు బరివెక్కినట్లు ఉండడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి.
మన చుట్టూ ఉండే నెగెటివ్ వైబ్రేషన్స్ కూడా కారణం అవ్వచ్చు. ఇలాంటి సమయంలో పూజ త్వరగా ముగించుకుని వచ్చేయండి. లేదంటే ఒకసారి లేచి కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని కొనసాగించొచ్చు. మన మనసు పూజ మీద నిలపలేకపోవడానికి కారణం నెగెటివ్ ఎనర్జీ కూడా అవ్వచ్చు. సాంబ్రాణి, ధూపం వేస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంటిని తుడిచే నీళ్లల్లో పసుపు, రాళ్ల ఉప్పు వేస్తే కూడా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కర్పూరాన్ని, లవంగాలని కలిసి కాల్చితే కూడా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇలా చేయడం వలన నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మనసు పూజ మీద పెట్టడానికి అవుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…