నేడే ఆషాఢ‌ అమావాస్య.. రావి చెట్టుకు నీరు పోసి పూజిస్తే?

July 9, 2021 10:31 AM

మన తెలుగు నెలలో ప్రతి నెల ఏదో ఒక ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. తెలుగు నెలలో 4వ నెల అయిన ఆషాడమాసం నేడు ప్రారంభం అవుతుంది. ఈ ఆషాడమాసంలో శుభకార్యాలను మాత్రమే వాయిదా వేసినప్పటికీ ఈనెలని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ ఆషాడ అమావాస్యను ఆషాధి అమావాస్య లేదా హలహరి అమావాస్య అని కూడా అంటారు. మరి ఎంతో ముఖ్యమైన ఈ అమావాస్య ఏ సమయంలో వస్తుంది. అమావాస్య రోజు ఏ పనులు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఆషాడ అమావాస్య 2021 జులై 9వ తేదీన వస్తుంది. అమావాస్య ఉదయం 5:16 గంటలకు ప్రారంభమయ్యే పదవ తేదీ ఉదయం 6:46 గంటల వరకు అమావాస్య ఘడియలు ఉంటాయి. ఈ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కరించి నీటిని తర్పణంగా వదలాలి.అదేవిధంగా మన పూర్వీకులను, పితృదేవతలను తలచుకొని వారికోసం ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది.

ఎంతో విశిష్టమైన ఈ ఆషాఢ అమావాస్య రోజున నిరుపేదలకు మన స్తోమతకు తగ్గట్టుగా దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల ఎంతో పుణ్యఫలం. ఈ అమావాస్య రోజు ఉదయం రావి చెట్టుకు నీరు పోసి రావాలి. సాయంత్రం రావి చెట్టుకింద నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా ఈ ఆషాడమాసం నుంచి సూర్యుడు మకర రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు కనుక ఈ ఆరు నెలల కాలాన్ని దక్షిణాయానం అని పిలుస్తారు. ఎంతో పవిత్రమైన ఈ ఆషాడమాసంలో తెలంగాణలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తారు. అదేవిధంగా పూరి జగన్నాథ రథయాత్ర ను కూడా ఆషాడ మాసంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now