Kiradu Temple : ఈ దేవాలయంలోకి సూర్యాస్తమయం తరువాత వెళ్తే అంతే.. రాళ్లుగా మారిపోతారు..

April 15, 2023 9:43 PM

Kiradu Temple : అసలు ఈ ప్రపంచమే ఓ పెద్ద వింత. దీంట్లో మనకు తెలియని, తెలిసిన వింతలు, విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని కొంత కాలం పాటు వింతలుగా ఉన్నా కాలానుగుణంగా అవి ఆ స్థాయిని కోల్పోతాయి. కానీ కొన్ని వింతలు మాత్రం ఎల్లప్పుడూ రహస్యంగానే ఉంటాయి. అలాగే కొనసాగుతాయి. ఎన్నేళ్లయినా వాటిలో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే వాటి గురించి ఎప్పటికప్పుడు కొత్తవారు తెలుసుకుంటూనే ఉంటారు. కాగా రాజస్థాన్‌లోని ఓ దేవాలయం కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇందులో వింత, రహస్యం ఏముంది అంటారా..? అక్కడికే వస్తున్నాం.

ముట్టుకోగానే రాయిలా మారిపోయేలా చూపించే సినిమాలను మనం గతంలో చూశాం కదా. ఆ..! అవును..! ఈ దేవాలయం కూడా అలాంటిదే. కాకపోతే ఇందులో సూర్యాస్తమయం తరువాత ఉండకూడద‌ట‌. ఉంటే ఇక అంతే సంగతుల‌ట‌..! వారు తెల్లారేసరికి రాయిలా మారిపోతారట. గత ఎన్నో ఏళ్లుగా ఈ మిస్టరీ ఆ దేవాలయంలో దాగి ఉంది. అసలు దీనికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్‌లోని బద్మెర్ జిల్లాలో కిరడు అనే పేరిట ఓ దేవాలయం ఉంది. ఇందులో దాగి ఉన్న రహస్యం పట్ల ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది. సూర్యాస్తమయం దాటిన తరువాత ఈ దేవాలయంలో ఎవరైనా ఉంటే వారు తెల్లవారేసరికి రాళ్లలా మారిపోతారట.

Kiradu Temple who enter into this will become stone
Kiradu Temple

కొన్ని వేల ఏళ్ల కిందట ఓ రుషి తన విద్యార్థులతో కలిసి ఈ కిరడు దేవాలయానికి వచ్చాడట. అయితే ఆ రుషి తన విద్యార్థులను దేవాలయం సమీపంలో వదలి స్థానికంగా ఉన్న ఓ ప్రాంతాన్ని చూసేందుకు బయటికి వెళ్లాడట. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలు ఎవరూ ఆ విద్యార్థులకు సహాయం చేయలేదట. కొన్ని రోజుల తరువాత ఆ రుషి తిరిగి వచ్చాడు. కాగా అప్పటికే ఆ విద్యార్థుల ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో వారిని చూసిన ఆ రుషి జరిగిన విషయం తెలుసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన రుషి రాయి లాంటి హృదయం కలిగిన స్థానికులను రాళ్లుగా మారమని శపించాడు.

కాగా ఆ గ్రామంలో కేవలం ఒకే ఒక్క మహిళ ఆ విద్యార్థులకు సహాయం చేసింది. ఆ రుషి ఈ విషయం కూడా తెలుసుకున్నాడు. దీంతో ఆమెకు శాపం వర్తించకుండా చేశాడు. అయితే ఆమెను వెనక్కి తిరిగి చూడకుండా పోవాలని ఆదేశించాడు. కానీ ఆ మహిళ వెళ్లే క్రమంలో వెనక్కి తిరిగి చూసింది. దీంతో ఆమె కూడా రాయిగా మారిపోయింది. అయితే అలా రాయిగా మారిన మహిళ విగ్రహం ఇప్పటికీ ఆ గ్రామంలో అలాగే ఉందట. ఆ విగ్రహం దేవాలయానికి కొంత సమీపంలో ఉంటుంది. కాలానుగుణంగా ఆ శాపం కాస్తా దేవాలయానికే పరిమితమైందని చెబుతారు. అందుకే ఆ దేవాలయంలో సూర్యాస్తమయం తరువాత ఉన్న వారు రాళ్లుగా మారుతారట.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment