Kali Purushudu : ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. జనాలు చాలా మంది ఈర్ష్యాసూయలు, లంచగొండితనం, దుర్వ్యసనాలను కలిగి ఉన్నారు. వీరే మంచివాళ్లుగా, గొప్పవాళ్లుగా పేరుపొందుతుంటారు. నమ్మకంగా ఉండి, ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు, చేసే వారు ఈ సమాజంలో చాలా తక్కువే. వారిని వేళ్లపై లెక్క పెట్టవచ్చు. అయితే ఇలాంటి వారికి సమాజంలో ఆదరణ ఉండదు. వీరిని కొందరు తొక్కేస్తారు. అయితే ఎప్పటికైనా నీతి నిజాయితీలకే కదా విలువ ఉండేది. కనుక చెడు వ్యసనాలు కలిగి ఉండేవారు, అసాంఘిక కార్యకలాపాలు చేసే వారు ఎప్పటికైనా దారుణంగా చనిపోతారు. ఇక ఇప్పుడున్న కలియుగంలో కలి ప్రభావం అసలు ఎప్పుడు మొదలైందో, కలి ఎక్కడెక్కడ ఉంటాడో, ఎలా మనల్ని నాశనం చేస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం.
ద్వాపరయుగాంత కాలంలో అన్నాచెల్లెళ్లకు పుట్టినవాడే కలి పురుషుడు. ద్వాపర యుగం అంతరించి కలి ప్రవేశించి, కలియుగం ఆరంభమవుతున్న దశలో పరీక్షిత్ అనే పేరున్న మహారాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తుంటాడు. ఈ క్రమంలో ఒక రోజున పరీక్షిత్ మహారాజుకు గోమాత ఏడుపు వినిపిస్తుంది. దాని వద్దకు వెళ్లి చూడగా ఆ ఆవుకు ఒక కాలు ఉండదు. ఎందుకు ఇలా జరిగింది, ఎవరు కాలును నరికేశారు అని పరీక్షిత్ అడుగుతాడు. అందుకు ఆ ఆవు, తన కాలును కలి తీసివేశాడని చెబుతుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పరీక్షిత్తు కలిని పట్టుకుని బంధిస్తాడు. అతన్ని చిత్రవధ చేస్తాడు.
అయితే పరీక్షిత్తు మహారాజు చేస్తున్న హింసకు తట్టుకోలేని కలి తనను ఎందుకు అలా కొడుతున్నావ్ అని అడుగుతాడు. అందుకు తాను చూసింది పరీక్షిత్తు కలికి చెబుతాడు. అప్పుడు కలి ఇది కలియుగం కాబట్టి తాను ప్రవేశించానని తాను ఏమైనా చేస్తానని అంటాడు. కానీ అందుకు పరీక్షిత్తు ఒప్పుకోడు. అప్పుడు కలి తాను ఉండే చోటుకు జనాలను రావద్దని కోరుతాడు. అందుకు పరీక్షిత్తు ఒప్పుకుంటాడు. ఈ క్రమంలో కలి జూదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే చోట్లలో ఉంటాడు.
అందులో భాగంగా జూదశాల నుంచి వచ్చే అసత్యం, మద్యపానం నుంచి వచ్చే మదం, అహంకారం, వ్యభిచారం నుంచి వచ్చే కామము, హింస నుంచి వచ్చే కోపం, క్రౌర్యంలలోనూ కలి చేరుతాడు. దీంతోపాటు నెమ్మదిగా బంగారంలోనూ కలి స్థానం ఆక్రమిస్తాడు. దాన్నుంచి పుట్టే మాత్సర్యంలోకి కూడా కలి చేరుతాడు. దీంతో కలి మొత్తం 9 స్థానాలను ఆక్రమిస్తాడు. ఈ 9 స్థానాల్లో ఉండేవారిని కలి పట్టి పీడిస్తాడని చెబుతాడు. అయితే పరీక్షిత్తు మహారాజు కూడా కలి ప్రభావం వల్ల మరణిస్తాడు. అతను ధరించే బంగారు ఆభరణాల వల్ల మాత్సర్యం పీడితుడై ఓ ముని శాపం బారిన పడి పాము కాటుకు మరణిస్తాడు. అందు వల్ల పైన చెప్పిన ఆ తొమ్మిందిటికి మనుషులు దూరంగా ఉంటే కలి ప్రభావం ఉండదని పురాణాలు చెబుతున్నాయి.
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…