Kali Purushudu : ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. జనాలు చాలా మంది ఈర్ష్యాసూయలు, లంచగొండితనం, దుర్వ్యసనాలను కలిగి ఉన్నారు. వీరే మంచివాళ్లుగా, గొప్పవాళ్లుగా పేరుపొందుతుంటారు. నమ్మకంగా ఉండి, ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు, చేసే వారు ఈ సమాజంలో చాలా తక్కువే. వారిని వేళ్లపై లెక్క పెట్టవచ్చు. అయితే ఇలాంటి వారికి సమాజంలో ఆదరణ ఉండదు. వీరిని కొందరు తొక్కేస్తారు. అయితే ఎప్పటికైనా నీతి నిజాయితీలకే కదా విలువ ఉండేది. కనుక చెడు వ్యసనాలు కలిగి ఉండేవారు, అసాంఘిక కార్యకలాపాలు చేసే వారు ఎప్పటికైనా దారుణంగా చనిపోతారు. ఇక ఇప్పుడున్న కలియుగంలో కలి ప్రభావం అసలు ఎప్పుడు మొదలైందో, కలి ఎక్కడెక్కడ ఉంటాడో, ఎలా మనల్ని నాశనం చేస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం.
ద్వాపరయుగాంత కాలంలో అన్నాచెల్లెళ్లకు పుట్టినవాడే కలి పురుషుడు. ద్వాపర యుగం అంతరించి కలి ప్రవేశించి, కలియుగం ఆరంభమవుతున్న దశలో పరీక్షిత్ అనే పేరున్న మహారాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తుంటాడు. ఈ క్రమంలో ఒక రోజున పరీక్షిత్ మహారాజుకు గోమాత ఏడుపు వినిపిస్తుంది. దాని వద్దకు వెళ్లి చూడగా ఆ ఆవుకు ఒక కాలు ఉండదు. ఎందుకు ఇలా జరిగింది, ఎవరు కాలును నరికేశారు అని పరీక్షిత్ అడుగుతాడు. అందుకు ఆ ఆవు, తన కాలును కలి తీసివేశాడని చెబుతుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పరీక్షిత్తు కలిని పట్టుకుని బంధిస్తాడు. అతన్ని చిత్రవధ చేస్తాడు.
అయితే పరీక్షిత్తు మహారాజు చేస్తున్న హింసకు తట్టుకోలేని కలి తనను ఎందుకు అలా కొడుతున్నావ్ అని అడుగుతాడు. అందుకు తాను చూసింది పరీక్షిత్తు కలికి చెబుతాడు. అప్పుడు కలి ఇది కలియుగం కాబట్టి తాను ప్రవేశించానని తాను ఏమైనా చేస్తానని అంటాడు. కానీ అందుకు పరీక్షిత్తు ఒప్పుకోడు. అప్పుడు కలి తాను ఉండే చోటుకు జనాలను రావద్దని కోరుతాడు. అందుకు పరీక్షిత్తు ఒప్పుకుంటాడు. ఈ క్రమంలో కలి జూదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే చోట్లలో ఉంటాడు.
అందులో భాగంగా జూదశాల నుంచి వచ్చే అసత్యం, మద్యపానం నుంచి వచ్చే మదం, అహంకారం, వ్యభిచారం నుంచి వచ్చే కామము, హింస నుంచి వచ్చే కోపం, క్రౌర్యంలలోనూ కలి చేరుతాడు. దీంతోపాటు నెమ్మదిగా బంగారంలోనూ కలి స్థానం ఆక్రమిస్తాడు. దాన్నుంచి పుట్టే మాత్సర్యంలోకి కూడా కలి చేరుతాడు. దీంతో కలి మొత్తం 9 స్థానాలను ఆక్రమిస్తాడు. ఈ 9 స్థానాల్లో ఉండేవారిని కలి పట్టి పీడిస్తాడని చెబుతాడు. అయితే పరీక్షిత్తు మహారాజు కూడా కలి ప్రభావం వల్ల మరణిస్తాడు. అతను ధరించే బంగారు ఆభరణాల వల్ల మాత్సర్యం పీడితుడై ఓ ముని శాపం బారిన పడి పాము కాటుకు మరణిస్తాడు. అందు వల్ల పైన చెప్పిన ఆ తొమ్మిందిటికి మనుషులు దూరంగా ఉంటే కలి ప్రభావం ఉండదని పురాణాలు చెబుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…