ఈతి బాధలు పోవాలంటే కొబ్బరి కాయతో ఇలా చేయాలి..!

February 27, 2022 12:11 PM

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక విధమైన సమస్యలు కుటుంబ సభ్యులను వేధిస్తుంటాయి. రోజంతా పనులలో నిమగ్నమైనప్పటికీ ఇంటికి వెళ్లే సమయానికి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే ఎంతో చికాగ్గా అనిపిస్తుంది. ఈ విధంగా మన ఇంట్లో ప్రశాంతత కరువైపోవడానికి గల కారణం గ్రహదోషాలు అని చెప్పవచ్చు.

గ్రహ దోషాలు ఉండటం వల్ల కుటుంబ సభ్యులకు ఈతి బాధలు, ఆందోళనలు ఉంటాయి. ఈ విధమైనటువంటి గ్రహదోషాలు, ఈతి బాధల నుంచి బయటపడాలంటే కొబ్బరికాయతో ఈ విధంగా చేయటం వల్ల మంచి జరుగుతుందని పురోహితులు చెబుతున్నారు.

మన ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడాలంటే ముందుగా ఆవుపేడతో తయారుచేసిన ప్రమిదలో బెల్లం ముక్క వేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం ద్వారా మన ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా కొబ్బరికాయకు నల్లని దారాన్ని కట్టి దానిని పూజ గదిలో ఉంచి పూజ చేయాలి. సాయంత్రం ఆ కొబ్బరికాయను, నల్లని దారాన్ని కాల్చివేయాలి. ఈ విధంగా తొమ్మిది రోజులపాటు చేయటం వల్ల మన ఇంట్లో ఏర్పడిన దోషాలు తొలగిపోయి సుఖసంతోషాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment