Guava As Naivedyam : దేవుడికి మనం నిత్యం పూజ చేస్తూ ఉంటాం. పూజ చేసినప్పుడు దేవుడికి పూలు, పండ్లు పెడుతూ ఉంటాం. నైవేద్యంగా కొన్ని పండ్లను దేవుడికి పెడుతూ ఉంటాం. అయితే దేవుడికి పండ్లను నైవేద్యం పెట్టినప్పుడు చాలామంది జామపండుని, ద్రాక్ష పండ్లను ఇలా ఏ పండు ఉంటే ఆ పండ్లని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అయితే పూజా కార్యక్రమంలో నైవేద్యం పెట్టడం వలన గౌరవ మర్యాదలతోపాటు సిరిసంపదలు కూడా పెరుగుతాయని జ్యోతిష నిపుణులు అంటున్నారు.
దేవుడికి నైవేద్యంగా ద్రాక్ష పండ్లను పెట్టి పేదవారికి దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయం అవుతాయట. అలాగే వీటిని ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు లేదంటే పెద్దలైనా తినొచ్చు. ఇలా చేయడం వలన సుఖ శాంతులు కలుగుతాయి. అలానే దేవుడికి నైవేద్యంగా జామ పండ్లను పెడితే మంచి సత్కారాలని పొందుతారు. వినాయకుడికి జామ పండ్లను నైవేద్యంగా పెడితే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉండవు.
గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత సమస్యలు దూరం అవుతాయని జ్యోతిష నిపుణులు అంటున్నారు. జామకాయలని మనం దేవుళ్ళకి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. నైవేద్యంగా పెట్టిన ఆ పండ్లను సుమంగళులకు అందిస్తే షుగర్ వ్యాధి తగ్గుతుంది. పెళ్లి కాని అమ్మాయిల చేత పూజ చేయించి ముత్తైదువులకు జామ పండ్లతో తాంబూలం ఇస్తే మంచి వరుడు వస్తాడని పండితులు అంటున్నారు.
గౌరీ పూజకి నైవేద్యంగా ఉంచి పూజించిన జామ పండ్లని తినడం వలన మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు. కోరికలు కూడా నెరవేరుతాయి. దుర్గాదేవికి జామ పండ్లు నైవేద్యంగా పెట్టి, పిల్లలున్న వాళ్లకి ఇస్తే సంవత్సరంలో వాళ్లకి సంతానం కలుగుతుంది. ఇలా ఈ విధంగా పాటించడం వలన సమస్యలేమీ లేకుండా ఉండొచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…