Calcium : పాలు ఆరోగ్యానికి చాలా మంచివని చాలామంది పాలని తీసుకుంటూ ఉంటారు. పాలను తీసుకోవడం వలన అనేక లాభాలని పొందొచ్చు. పాలల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అయితే, పాల కంటే ఎక్కువ కాల్షియం ఉండే ఆహార పదార్థాల గురించి తెలుసుకుని మీరు వాటిని తీసుకున్నట్లయితే, ఎక్కువ కాల్షియం పొందొచ్చు. వీటిలో పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుందట. మరి ఇక ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలను చూసేద్దాం.
పాలల్లో క్యాల్షియం తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. పాలు తాగడం వలన ఎముకలు దృఢంగా ఉంటాయి. దానితో పాటుగా, ఇతర లాభాలను మనం పాల ద్వారా పొందవచ్చు. అయితే, పాల కంటే ఎక్కువ కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. మరి ఇక వాటి గురించి తెలుసుకుందాం. నీళ్లు కలపని గేదె పాలల్లో చూసుకున్నట్లయితే, 220 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అదే నీళ్లు కలిపితే 120 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఆవు పాలలో 120 మిల్లి గ్రాముల క్యాల్షియం ఉంటుంది.
అయితే, గోరుచిక్కుడు లో చూసుకున్నట్లయితే, 100 గ్రాముల గోరు చిక్కుడు లో 130 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. శనగలలో 202 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. బాదంపప్పులో చూసుకున్నట్లయితే, 100 గ్రాముల బాదం లో 230 మిల్లీగ్రాముల క్యాల్షియం, 100 గ్రాముల సోయాబీన్స్ లో 240 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఉలవల్లో చూసుకున్నట్లయితే, 100 గ్రాములు ఉలవల్లో 287 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.
రాగులలో 344 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల గోంగూరలో, 344 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల మెంతికూరలో 395 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల తోటకూరలో 397 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల ఎండు కొబ్బరిలో 400 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.
100 గ్రాముల మునగాకులో 440 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల పొన్నగంటి కూరలో 510 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఇలా, ఈ ఆహార పదార్థాలలో పాల కంటే ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. కాబట్టి పాలే తీసుకోకర్లేదు. క్యాల్షియం ని పొందడానికి, పాల కంటే ఎక్కువ కాల్షియం ఉండే ఈ ఆహార పదార్థాలను తీసుకోవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…