Calcium : పాలు ఆరోగ్యానికి చాలా మంచివని చాలామంది పాలని తీసుకుంటూ ఉంటారు. పాలను తీసుకోవడం వలన అనేక లాభాలని పొందొచ్చు. పాలల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అయితే, పాల కంటే ఎక్కువ కాల్షియం ఉండే ఆహార పదార్థాల గురించి తెలుసుకుని మీరు వాటిని తీసుకున్నట్లయితే, ఎక్కువ కాల్షియం పొందొచ్చు. వీటిలో పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుందట. మరి ఇక ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలను చూసేద్దాం.
పాలల్లో క్యాల్షియం తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. పాలు తాగడం వలన ఎముకలు దృఢంగా ఉంటాయి. దానితో పాటుగా, ఇతర లాభాలను మనం పాల ద్వారా పొందవచ్చు. అయితే, పాల కంటే ఎక్కువ కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. మరి ఇక వాటి గురించి తెలుసుకుందాం. నీళ్లు కలపని గేదె పాలల్లో చూసుకున్నట్లయితే, 220 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అదే నీళ్లు కలిపితే 120 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఆవు పాలలో 120 మిల్లి గ్రాముల క్యాల్షియం ఉంటుంది.
అయితే, గోరుచిక్కుడు లో చూసుకున్నట్లయితే, 100 గ్రాముల గోరు చిక్కుడు లో 130 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. శనగలలో 202 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. బాదంపప్పులో చూసుకున్నట్లయితే, 100 గ్రాముల బాదం లో 230 మిల్లీగ్రాముల క్యాల్షియం, 100 గ్రాముల సోయాబీన్స్ లో 240 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఉలవల్లో చూసుకున్నట్లయితే, 100 గ్రాములు ఉలవల్లో 287 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.
రాగులలో 344 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల గోంగూరలో, 344 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల మెంతికూరలో 395 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల తోటకూరలో 397 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల ఎండు కొబ్బరిలో 400 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.
100 గ్రాముల మునగాకులో 440 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల పొన్నగంటి కూరలో 510 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఇలా, ఈ ఆహార పదార్థాలలో పాల కంటే ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. కాబట్టి పాలే తీసుకోకర్లేదు. క్యాల్షియం ని పొందడానికి, పాల కంటే ఎక్కువ కాల్షియం ఉండే ఈ ఆహార పదార్థాలను తీసుకోవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…