Lord Hanuman : ప్రతి ఒక్కరూ కూడా వాళ్ల కోరికల్ని దేవుడికి చెప్తూ ఉంటారు. అవి జరగాలని, మంచి జరగాలని పూజ చేస్తూ ఉంటారు. అయితే హనుమంతుడిని ఆరాధించేటప్పుడు ఈ విధంగా అనుసరించడం మంచిది. హనుమంతుడిని ఆరాధించడం వలన చాలా మంచి జరుగుతుంది. శాంతి కలుగుతుంది. హనుమ ఉపాసన వల్లే చాలా మనకి లభిస్తాయి. రామాయణంలో మిగిలిన కాండలకి ఏ పేర్లు ఉన్నా కూడా సుందరాకాండని మాత్రం మహర్షి సుందరాకాండ అనే వాళ్ళు. సుందరకాండలో స్వామి హనుమ మాట్లాడే తీరు పరిశీలిస్తే పరమాద్భుతంగా ఉంటుంది.
రామ కథే మత సంజీవిని. ఎక్కడ మాట్లాడాలో అక్కడ అంత వరకే మాట్లాడుతాడు తప్ప సాగ తీసి మాట్లాడలేదు. స్వామి హనుమాన్ ఉపాసన చేస్తే ఎలా మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ఎలా చక్క పెట్టాలి, ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి, ఉద్యోగులతో ఎలా నడుచుకోవాలి, మంత్రులతో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. అలాగే ఇతరుల హృదయాల్లో ఎలా చోటు సంపాదించుకోవాలో కూడా తెలుస్తుంది. పదిమందికి మార్గదర్శనం ఎలా చేయాలనేది కూడా తెలుస్తుంది.
అయితే ఎక్కడా కూడా ఎక్కువగా మాట్లాడలేదు. సాగదీసి మాట్లాడలేదు. ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే సముద్ర లంకనం చేసి వెళ్ళిపోతున్నాడు ఆయన. సముద్రుడు తనలో ఉన్నటువంటి బంగారు శిఖరములని కలిగి ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని ఉద్దేశించి నువ్వు పైకి కిందకి పక్కలకి కూడా పెరగగలవు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రుడికి సహాయం చేయడానికి హనుమంతుడు వెళ్తున్నాడు. తిరిగి నువ్వు ఉపకారం చేయాలి. శిఖరాల మీద పండ్లు ఉన్నాయి. తేనెపట్లు ఉన్నాయి.
హనుమకి స్వాగతం ఇచ్చి. ఆతిథ్యం ఇవ్వు అని అన్నాడు. వెంటనే మైనాక పర్వతం సముద్రంలో నుండి పైకి లేచింది. మైనాకుడు మనిషి శరీరాన్ని ధరించి నిలబడతాడు. స్వామి హనుమాన్ ని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. ఎవరైనా మనకి ఉపకారం చేస్తే వారికి తిరిగి ప్రత్యుపకారం చేయడానికి ఎప్పుడూ కూడా వెనుకంజ వేయకూడదు. నీ తండ్రి వాయువు నాకు ఒకసారి ఉపకారం చేశాడు. కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. గాలిలో ఎగిరి వెళ్తుంటే మరణిస్తాయని ఋషి సంఘములు, భూత సంఘములు భయపడుతుంటే ఇంద్రుడు వజ్రాయుధం ధరించి రెక్కలు తెంపేశాడు.
మీ తండ్రి స్నేహితుడు కనుక నన్ను పైకెత్తి తీసుకువచ్చి సముద్రంలో పెట్టాడు. అప్పుడు నేను సముద్రంలో పడిపోయినప్పుడు పాతాళంలో రాక్షసులు పైకి వచ్చేటువంటి మార్గానికి మూతలాగా అడ్డంగా పడ్డాను. మీ తండ్రి ఒకప్పుడు నాకు ఉపకారం చేశారు. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యాలి. సామాన్యమైన అతిథి వస్తేనే పొంగిపోతాము. అటువంటిది మీలాంటి అతిథి వస్తే ఎలా ఊరుకుంటాము. నా శిఖరములు మీద వాలి కూర్చో. కాస్త తేనె తాగు, పండ్లు తీసుకో. ఆ తర్వాత బయలుదేరండి అంటాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…