Lord Hanuman : ప్రతి ఒక్కరూ కూడా వాళ్ల కోరికల్ని దేవుడికి చెప్తూ ఉంటారు. అవి జరగాలని, మంచి జరగాలని పూజ చేస్తూ ఉంటారు. అయితే హనుమంతుడిని ఆరాధించేటప్పుడు ఈ విధంగా అనుసరించడం మంచిది. హనుమంతుడిని ఆరాధించడం వలన చాలా మంచి జరుగుతుంది. శాంతి కలుగుతుంది. హనుమ ఉపాసన వల్లే చాలా మనకి లభిస్తాయి. రామాయణంలో మిగిలిన కాండలకి ఏ పేర్లు ఉన్నా కూడా సుందరాకాండని మాత్రం మహర్షి సుందరాకాండ అనే వాళ్ళు. సుందరకాండలో స్వామి హనుమ మాట్లాడే తీరు పరిశీలిస్తే పరమాద్భుతంగా ఉంటుంది.
రామ కథే మత సంజీవిని. ఎక్కడ మాట్లాడాలో అక్కడ అంత వరకే మాట్లాడుతాడు తప్ప సాగ తీసి మాట్లాడలేదు. స్వామి హనుమాన్ ఉపాసన చేస్తే ఎలా మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ఎలా చక్క పెట్టాలి, ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి, ఉద్యోగులతో ఎలా నడుచుకోవాలి, మంత్రులతో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. అలాగే ఇతరుల హృదయాల్లో ఎలా చోటు సంపాదించుకోవాలో కూడా తెలుస్తుంది. పదిమందికి మార్గదర్శనం ఎలా చేయాలనేది కూడా తెలుస్తుంది.
అయితే ఎక్కడా కూడా ఎక్కువగా మాట్లాడలేదు. సాగదీసి మాట్లాడలేదు. ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే సముద్ర లంకనం చేసి వెళ్ళిపోతున్నాడు ఆయన. సముద్రుడు తనలో ఉన్నటువంటి బంగారు శిఖరములని కలిగి ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని ఉద్దేశించి నువ్వు పైకి కిందకి పక్కలకి కూడా పెరగగలవు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రుడికి సహాయం చేయడానికి హనుమంతుడు వెళ్తున్నాడు. తిరిగి నువ్వు ఉపకారం చేయాలి. శిఖరాల మీద పండ్లు ఉన్నాయి. తేనెపట్లు ఉన్నాయి.
హనుమకి స్వాగతం ఇచ్చి. ఆతిథ్యం ఇవ్వు అని అన్నాడు. వెంటనే మైనాక పర్వతం సముద్రంలో నుండి పైకి లేచింది. మైనాకుడు మనిషి శరీరాన్ని ధరించి నిలబడతాడు. స్వామి హనుమాన్ ని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. ఎవరైనా మనకి ఉపకారం చేస్తే వారికి తిరిగి ప్రత్యుపకారం చేయడానికి ఎప్పుడూ కూడా వెనుకంజ వేయకూడదు. నీ తండ్రి వాయువు నాకు ఒకసారి ఉపకారం చేశాడు. కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. గాలిలో ఎగిరి వెళ్తుంటే మరణిస్తాయని ఋషి సంఘములు, భూత సంఘములు భయపడుతుంటే ఇంద్రుడు వజ్రాయుధం ధరించి రెక్కలు తెంపేశాడు.
మీ తండ్రి స్నేహితుడు కనుక నన్ను పైకెత్తి తీసుకువచ్చి సముద్రంలో పెట్టాడు. అప్పుడు నేను సముద్రంలో పడిపోయినప్పుడు పాతాళంలో రాక్షసులు పైకి వచ్చేటువంటి మార్గానికి మూతలాగా అడ్డంగా పడ్డాను. మీ తండ్రి ఒకప్పుడు నాకు ఉపకారం చేశారు. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యాలి. సామాన్యమైన అతిథి వస్తేనే పొంగిపోతాము. అటువంటిది మీలాంటి అతిథి వస్తే ఎలా ఊరుకుంటాము. నా శిఖరములు మీద వాలి కూర్చో. కాస్త తేనె తాగు, పండ్లు తీసుకో. ఆ తర్వాత బయలుదేరండి అంటాడు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…