TCS Work From Home Jobs 2023 : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడాలనుకునే వాళ్లకి ఓ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది టీసీఎస్. కామన్ డిగ్రీ చేసి జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలని చూస్తే.. దేశంలోని అన్ని లొకేషన్లలో ఖాళీ ఉన్న ట్రెయినీ పోస్టులని భర్తీ చేస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టులకి స్త్రీ, పురుష అభ్యర్థులందరూ అర్హులే. ఆన్ లైన్ విధానం ద్వారా అప్లై చేయవచ్చు. సెప్టెంబర్ 5వ తేదీ నుండి సెప్టెంబర్ 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి దరఖాస్తు చేసేయవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 2024 ట్రైనీ బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ పోస్టులు వున్నాయి. ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు అర్హులే. దరఖాస్తు చేయవచ్చు.
ఇక వయస్సు విషయానికి వస్తే.. ఈ పోస్టులకి దరఖాస్తు చేయాలనుకునే వాళ్ళ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. విద్యార్హతలు చూస్తే.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం కళాశాల నుంచి బీఏ/బీకామ్/ బీఏఎఫ్/ బీబీఐ పూర్తి చేసుండాలి. లేదంటే బీబీఏ/ బీబీఎం / బీఎంఎస్ / బీఎస్సీ (గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం) లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సెప్టెంబర్ 20, 2023 వరకు ఈ పోస్టులకి అప్లై చేయడానికి టైం వుంది. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న నోటిఫికేషన్ లింకు పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ నుండి అప్లై చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం : https://www.tcs.com/careers/india/tcs-bps-fresher-hiring-2024
ఆన్ లైన్ అప్లై : https://www.tcs.com/careers/india/tcs-bps-fresher-hiring-2024
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్ను పట్టించుకుంటే ముందుకు…
సినిమాలు ఎంత బాగున్నప్పటికీ కొందరు రివ్యూయర్లు ఇచ్చే రివ్యూల కారణంగా నెగెటివ్ టాక్ వస్తుందని, దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం…