Kidney Failure : చాలామంది ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువమంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పొరపాట్లు చేయకూడదు. మనం తినే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. మరి ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు..?, కిడ్నీలు ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం వలన పాడవుతాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
కిడ్నీ సమస్యలు వచ్చే ముందు కొన్ని సంకేతాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే కచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. శరీరంలో వాపు కలగడం, చర్మం దురద పెట్టడం, మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది కలగడం, చికాకు ఇలాంటివి ఉన్నప్పుడు కిడ్నీ సమస్య ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు కచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. ఎక్కువ మద్యం తీసుకోవడం వలన కిడ్నీలు బాగా దెబ్బతింటాయి.
ఎక్కువ మద్యం తీసుకుంటే మూత్రపిండాల పనితీరులో ఇబ్బంది కలుగుతుంది. మెదడుని ఇది ప్రభావితం చేస్తుంది. ఆల్కహాల్ కిడ్నీపై దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. కాఫీ తీసుకోవడం వలన కూడా మూత్రపిండాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. కాఫీ ఎక్కువగా తాగితే కిడ్నీలు పాడవుతాయని గుర్తు పెట్టుకోండి. ఉప్పు తీసుకోవడం వలన కూడా కిడ్నీలు పాడవుతాయి.
ఉప్పులో సోడియం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉప్పుని తీసుకుంటే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఉప్పును కూడా బాగా తగ్గించండి. ఉప్పుని ఎక్కువ తీసుకుంటే చాలా రకాల సమస్యలు కలుగుతాయి. మాంసం తీసుకోవడం వలన కూడా కిడ్నీలలో మార్పులు వస్తాయి. మాంసంలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. కండరాల పెరుగుదలకు ప్రోటీన్ చాలా అవసరం.
మూత్రపిండాలపై ఒత్తిడిని మాంసం కలిగిస్తుంది. అలాగే ఈరోజుల్లో చాలామంది ఆర్టిఫిషియల్ ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. వాటి వలన కూడా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోవద్దు. కిడ్నీ సమస్యలు వీటి వలన కలుగుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి. ఇలా శరీరానికి హాని చేసే వాటిని తీసుకుంటే అనవసరంగా లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాలి.
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మి భారత్లో రియల్మి పవర్ డేస్ సేల్ పేరిట ప్రత్యేక సేల్ను నిర్వహిస్తోంది.…
ఇటీవలి కాలంలో టాలీవుడ్లో విస్తృతమైన కథనాలు, సినిమాటిక్ యూనివర్స్ ఆలోచనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ…
తాజా ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటారు. ఇటీవల ఫామ్పై ప్రశ్నలు…
బాహుబలి రెండు సినిమాలు తన కెరీర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచినప్పటికీ ఆ తరువాత వచ్చిన అనేక భారీ ఆఫర్లను వదులుకోవాల్సి…
మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా ఆయన చేసిన ఈ పోస్ట్…
ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసుతోపాటు పలు ఇతర కేసుల్లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలలో రిమాండ్…
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ (MeitY) శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ దేశవ్యాప్తంగా పలు…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు చరిత్రాత్మక వారసత్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…