Pooja Room : చ‌నిపోయిన వారి ఫొటోలను దేవుడి పూజ గదిలో పెడుతున్నారా.. అయితే ఏమవుతుందో తెలుసా..?

February 25, 2023 8:04 AM

Pooja Room : హిందువుల్లో అధిక శాతం మంది నిత్యం తమ తమ ఇష్ట దేవుళ్లను, దేవతలను పూజిస్తారు. ఇలా పూజించడం వెనుక ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. అయితే కేవలం దేవుళ్లు, దేవతలే కాదు, వారితోపాటు చనిపోయిన తమ పూర్వీకుల ఫొటోలను కూడా పూజ గదిలోనో, దేవుళ్ల పక్కనో ఉంచి, వాటికి కూడా నిత్యం దండం పెడుతుంటారు. చనిపోయిన వారిని దైవంగా భావించి, వారిని నిత్యం స్మరించుకోవడం కోసం చాలా మంది ఇలా చేస్తారు. ఇలా పూజించడంలో తప్పేమీ లేదు, కానీ దేవుడి దగ్గర, పూజ గదిలో చనిపోయిన వారి ఫొటోలను మాత్రం ఉంచకూడదట. ఇలా చేస్తే దేవుళ్లకు కోపం వస్తుందట. ఇందుకు గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫొటోలను పూజ గదిలో ఉంచడం సరికాదు. దీంతో సదరు కుటుంబానికి మంచి జరగదు.

do not keep dead persons photos in Pooja Room know why
Pooja Room

ఇండ్లలో ఈశాన్య దిశగా పూజ గదిని, నైరుతి దిశగా చనిపోయిన వారి ఫొటోలను ఉంచాలని వాస్తు సిద్ధాంతం చెబుతోంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ ఇంట్లోకి నెగటివ్ శక్తి ప్రసారమవుతుంది. అంతే కాదు ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా మానసిక ప్రశాంతత ఉండదు.

చనిపోయిన వారి ఫొటోలను దేవుళ్ల పక్కనే ఉంచి పూజ చేయడం హిందూ ధర్మం ప్రకారం పెద్ద తప్పిదమే అవుతుంది. మనిషి ఎల్లప్పుడూ దేవుడితో సమానం కాదని, నియమాలను అతిక్రమించి అలా చేస్తే ఆ కుటంబంలో అంద‌రికీ క‌ష్టాలు వ‌స్తాయ‌ని చెబుతున్నారు. క‌నుక చ‌నిపోయిన వారి ఫోటోల‌ను ఎప్ప‌టికీ దేవుడి ప‌క్క‌న లేదా పూజ గ‌దిలో పెట్ట‌రాదు. పెడితే అన్నీ క‌ష్టాలే వ‌స్తాయి.. అన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now