మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు దర్భలు ఉపయోగించడం చూస్తుంటాము. హోమాలు, యాగాలు, పితృ కర్మలు దేవతా ప్రతిష్ఠలు చేసేటప్పుడు దర్భలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ విధంగా దర్భలను ఉపయోగించడానికి కారణం ఏమిటి? పూజలో దర్భల ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దర్భలు ఒక రకమైన గడ్డి జాతి మొక్క. ఈ దర్భలు శ్రీరాముని స్పర్శకు నోచుకోవడం వల్ల వీటికి అంత ప్రాముఖ్యత ఉంది.అధిక ఉష్ణ శక్తి కలిగిన వీటిని నీటిలో వేయడం వల్ల నీటిని శుభ్రపరుస్తుంది కనుక సూర్యుడు నుంచి లేదా చంద్రుని నుంచి వెలువడే కిరణాల నుంచి నీటిని శుభ్ర పరచడానికి నీటిలో, ఇతర ఆహార పదార్థాలలో ఈ దర్భలు వేస్తారు.
ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు ఉంగరపు వేలుకు రెండు దర్భలతో చేసిన ఉంగరాన్ని తొడుగుతారు. పితృకార్యాలు చేసేటప్పుడు 3, దేవ కార్యాలలో 4 దర్భలతో తయారు చేసిన ఉంగరాన్ని వేలికి ధరిస్తారు. ఈ దర్భ అడుగుభాగాన బ్రహ్మదేవుడు, మధ్యభాగంలో విష్ణుమూర్తి, దర్భ శిఖరాన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువై ఉంటాడని చెబుతారు. ఎంతో పవిత్రమైన ఈ దర్భలను వినాయకుడికి సమర్పించే పూజించడం వల్ల కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…