దక్షిణాది రాష్ట్రాలలో బాదంపూరి తినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. ఎంతో రుచికరంగా ఉండే ఈ
బాదంపూరి తినడానికి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ బాదంపూరినీ పండుగ సమయాలలో ఒక ప్రత్యేక వంటకంగా తయారు చేస్తారు. ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉండే బాదంపూరినీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*మైదాపిండి రెండు కప్పులు
*రవ్వ మూడు టీస్పూన్లు
*తురిమిన కొబ్బరి మూడు టీ స్పూన్లు
*చక్కెర రెండు కప్పులు
*2 కప్పులు నూనె
*తగినంత బాదం
*పాలు కొద్దిగా
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, రెండు స్పూన్ల రవ్వ, ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ పదార్థాలన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమంలోకి కొద్ది కొద్దిగా పాలను కలుపుతూ ముద్దలా తయారు చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి రెండు కప్పుల పంచదార రెండు కప్పుల నీటిని వేసి బాగా మరిగించాలి. అదేవిధంగా స్టవ్ మీద కడాయిలో నూనె పెట్టి వేడి చేయాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ త్రిభుజాకారంలో చేసి నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా తయారైన పూరీలను షుగర్ సిరఫ్ లో వేసుకోవాలి. అరగంట తర్వాత కొబ్బరి తురుము వేసి అలంకరించుకొని తింటే ఎంతో అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…