దక్షిణాది రాష్ట్రాలలో బాదంపూరి తినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. ఎంతో రుచికరంగా ఉండే ఈ
బాదంపూరి తినడానికి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ బాదంపూరినీ పండుగ సమయాలలో ఒక ప్రత్యేక వంటకంగా తయారు చేస్తారు. ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉండే బాదంపూరినీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*మైదాపిండి రెండు కప్పులు
*రవ్వ మూడు టీస్పూన్లు
*తురిమిన కొబ్బరి మూడు టీ స్పూన్లు
*చక్కెర రెండు కప్పులు
*2 కప్పులు నూనె
*తగినంత బాదం
*పాలు కొద్దిగా
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, రెండు స్పూన్ల రవ్వ, ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ పదార్థాలన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమంలోకి కొద్ది కొద్దిగా పాలను కలుపుతూ ముద్దలా తయారు చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి రెండు కప్పుల పంచదార రెండు కప్పుల నీటిని వేసి బాగా మరిగించాలి. అదేవిధంగా స్టవ్ మీద కడాయిలో నూనె పెట్టి వేడి చేయాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ త్రిభుజాకారంలో చేసి నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా తయారైన పూరీలను షుగర్ సిరఫ్ లో వేసుకోవాలి. అరగంట తర్వాత కొబ్బరి తురుము వేసి అలంకరించుకొని తింటే ఎంతో అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు.
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…