మధ్యప్రదేశ్లోని భోపాల్లో దారుణం చోటు చేసుకుంది. ఉపాధి లేక ఓ మహిళ పని ఇప్పించమని సహాయం కోసం వస్తే ఓ తండ్రి, కొడుకు ఇద్దరూ కలిసి ఆమెను కొన్ని నెలల పాటు బంధించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఇంకో వ్యక్తికి అమ్మేశారు. ఈ క్రమంలో బాధితురాలిని పోలీసులు రక్షించి నిందితులపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన రతిబాద్ ఏరియాలో ఉంటున్న 27 ఏళ్ల మహిళ భర్తను 6 నెలల కిందట పోలీసులు ఓ కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో ఆమె బతుకు భారం అయింది. పోషించేవారు కరువయ్యారు. ఈ క్రమంలో ఆమె పని కావాలని అదే ప్రాంతానికి చెందిన రవి అనే వ్యక్తిని కోరింది. అయితే రవి ఆమెకు పని ఇప్పిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి ఆమెను బంధించాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. తరువాత అతని తండ్రి రమేష్ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అలా వారిద్దరూ ఆమెను కొన్ని నెలల పాటు బంధించి ఆమెపై రోజూ అత్యాచారం చేశారు. చివరికి అదే ప్రాంతానికి చెందిన సర్మాన్ ప్రజాపతి (38) అనే వ్యక్తికి ఆమెను వారు రూ.60వేలకు విక్రయించారు. అతను ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ ఇద్దరికి ఆ మొత్తం చెల్లించి ఆమెను తీసుకెళ్లాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను ప్రజాపతి బారి నుంచి రక్షించారు. తరువాత నిందితులు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. కాగా రవి, రమేష్ లు ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…