మధ్యప్రదేశ్లోని భోపాల్లో దారుణం చోటు చేసుకుంది. ఉపాధి లేక ఓ మహిళ పని ఇప్పించమని సహాయం కోసం వస్తే ఓ తండ్రి, కొడుకు ఇద్దరూ కలిసి ఆమెను కొన్ని నెలల పాటు బంధించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఇంకో వ్యక్తికి అమ్మేశారు. ఈ క్రమంలో బాధితురాలిని పోలీసులు రక్షించి నిందితులపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన రతిబాద్ ఏరియాలో ఉంటున్న 27 ఏళ్ల మహిళ భర్తను 6 నెలల కిందట పోలీసులు ఓ కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో ఆమె బతుకు భారం అయింది. పోషించేవారు కరువయ్యారు. ఈ క్రమంలో ఆమె పని కావాలని అదే ప్రాంతానికి చెందిన రవి అనే వ్యక్తిని కోరింది. అయితే రవి ఆమెకు పని ఇప్పిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి ఆమెను బంధించాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. తరువాత అతని తండ్రి రమేష్ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అలా వారిద్దరూ ఆమెను కొన్ని నెలల పాటు బంధించి ఆమెపై రోజూ అత్యాచారం చేశారు. చివరికి అదే ప్రాంతానికి చెందిన సర్మాన్ ప్రజాపతి (38) అనే వ్యక్తికి ఆమెను వారు రూ.60వేలకు విక్రయించారు. అతను ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ ఇద్దరికి ఆ మొత్తం చెల్లించి ఆమెను తీసుకెళ్లాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను ప్రజాపతి బారి నుంచి రక్షించారు. తరువాత నిందితులు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. కాగా రవి, రమేష్ లు ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త రిక్రూట్మెంట్…
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…