రుతు పవనాలు, అల్పపీడనాలు, ద్రోణుల కారణంగా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అనేక చోట్ల వర్షాలు పెను విధ్వంసాలను సృష్టిస్తున్నాయి. నిన్న కాక మొన్న యూపీ, రాజస్థాన్లలో పిడుగులు పడి ఏకంగా 87 మంది మృతి చెందారు. ఇక తాజాగా గుజరాత్లోనూ భారీ వర్షాలు కురుస్తూ పిడుగులు పడుతున్నాయి.
మంగళవారం మధ్యాహ్నం గుజరాత్లోని దేవభూమి ద్వారక జిల్లాలో ఉన్న ద్వారకాధీష్ ఆలయంపై పిడుగులు పడ్డాయి. దీంతో ఆలయ గోపురంపై ఉన్న జెండా దెబ్బ తిన్నది. పిడుగు నేరుగా ఆ జెండా మీదే పడింది. అయితే ఆ పిడుగు వల్ల ఆలయానికి ఎలాంటి నష్టం జరగలేదు. ఆ సమయంలో ఆలయంలో, చుట్టు పక్కల కొందరు భక్తులు ఉన్నారు. కానీ ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.
ఇక అదే సమయంలో వీడియో తీసి దాన్ని కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ క్రమంలో ఆలయంపై పిడుగు పడిన ఆ వీడియో వైరల్గా మారింది. చూస్తుంటేనే చాలా భయంగా అనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆ జిల్లా పాలక విభాగం అధికారులతో కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టం ఏమీ జరగలేదని అధికారులు మంత్రికి చెప్పారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…