రుతు పవనాలు, అల్పపీడనాలు, ద్రోణుల కారణంగా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అనేక చోట్ల వర్షాలు పెను విధ్వంసాలను సృష్టిస్తున్నాయి. నిన్న కాక మొన్న యూపీ, రాజస్థాన్లలో పిడుగులు పడి ఏకంగా 87 మంది మృతి చెందారు. ఇక తాజాగా గుజరాత్లోనూ భారీ వర్షాలు కురుస్తూ పిడుగులు పడుతున్నాయి.
మంగళవారం మధ్యాహ్నం గుజరాత్లోని దేవభూమి ద్వారక జిల్లాలో ఉన్న ద్వారకాధీష్ ఆలయంపై పిడుగులు పడ్డాయి. దీంతో ఆలయ గోపురంపై ఉన్న జెండా దెబ్బ తిన్నది. పిడుగు నేరుగా ఆ జెండా మీదే పడింది. అయితే ఆ పిడుగు వల్ల ఆలయానికి ఎలాంటి నష్టం జరగలేదు. ఆ సమయంలో ఆలయంలో, చుట్టు పక్కల కొందరు భక్తులు ఉన్నారు. కానీ ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.
ఇక అదే సమయంలో వీడియో తీసి దాన్ని కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ క్రమంలో ఆలయంపై పిడుగు పడిన ఆ వీడియో వైరల్గా మారింది. చూస్తుంటేనే చాలా భయంగా అనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆ జిల్లా పాలక విభాగం అధికారులతో కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టం ఏమీ జరగలేదని అధికారులు మంత్రికి చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…