మన హిందూ సంప్రదాయంలో ఎంతో మంది దేవతలు ఉన్నారు. అదేవిధంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని మొక్కలను, జంతువులను కూడా దైవ సమానంగా భావించి పూజలు చేస్తాము. అయితే ఆవులను, గరుడ పక్షులను, నందీశ్వరుడిని ఇలా కొన్నింటిని దైవ సమానంగా భావించి భక్తి భావంతో పూజలు చేయడం మనం చూస్తున్నాము. కానీ మీరు ఎప్పుడైనా గబ్బిలాలకు పూజలు చేయటం విన్నారా… వినడానికి వింతగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, రైల్వే కోడూరు మండలంలో,మాధవరంపోడు గ్రామంలో గబ్బిలాలనే దైవ సమానంగా భావించి పూజలు చేస్తున్నారు.ఇలా గబ్బిలాలకు పూజలు చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
మాధవరంపోడు గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం పంటలు పండక ఎన్నో కరువుకాటకాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఊరిలో గొడవలు, ముఠా కక్షలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలా గ్రామం మొత్తం కరువుకాటకాలు ఏర్పడిన నేపథ్యంలో ఊరి బయట ఉన్నటువంటి ఓ మర్రి చెట్టు పైకి వందలాది సంఖ్యలో గబ్బిలాలు వచ్చి చేరాయి. ఈ విధంగా గబ్బిలాలు వచ్చిన తర్వాత వారి గ్రామంలో ముఠా కక్షలు తగ్గి, వర్షాలు పడటంతో రైతులందరూ పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో కరవుకాటకాలు కూడా దూరం కావడంతో ప్రజలందరూ గబ్బిలాలు వచ్చిన తర్వాతే వారి గ్రామం అభివృద్ధి వైపు నడిచిందని భావించి ఆ గబ్బిలాలు నివసించే చెట్టుకు పూజ చేయడం ప్రారంభించారు.
ప్రస్తుతం ఈ గ్రామంలో గబ్బిలాలు ఉన్న చెట్టుకు పూజ చేయటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు పక్షి దోషాలతో బాధపడుతుంటారు. అలాంటి వారిని ఈ చెట్టు దగ్గరకు తీసుకువచ్చి పూజలు చేసి వారికి గబ్బిలాల ఎముకలను తాయత్తుగా కట్టడంవల్ల పక్షి దోషం తొలగిపోతుందని విశ్వసిస్తారు. ఈ సమయంలోనే పెద్ద ఎత్తున చిన్నపిల్లలను తీసుకుని ఈ చెట్టు వద్దకు వచ్చి పూజలు చేయటం విశేషం. ఈ గ్రామంలో వందలాది సంఖ్యలో గబ్బిలాలు ఉండగా ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడా ప్రమాదం కనిపించకపోవడం విశేషం.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…