మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని ఓ గ్రామంలో వీధులలో మొసలి తిరుగుతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మొసలిని కొంతమంది స్థానికులు గుర్తించారు. రాష్ట్రంలో భారీ వర్షపాతం తరువాత కృష్ణా నదిలో నీటి మట్టం పెరిగి మొసలి నీటి నుండి సులభంగా బయటకు వచ్చినట్లు గుర్తించారు. అయితే ఆ తరువాత ఏమైంది ? అన్న వివరాలు తెలియలేదు.
కాగా కుండపోత వర్షాలు, కొండచరియలు విరిగి పడడం, వరదలతో మహారాష్ట్ర అల్లకల్లోలంగా మారింది. అక్కడ వరదల వల్ల ఎక్కువగా థానే, రాయ్ఘడ్, రత్నగిరి, సతారా, సాంగ్లి, కొల్హాపూర్ జిల్లాలు ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగి పడడం వల్ల మరణించిన వారి సంఖ్య ఆదివారం వరకు 113 కు చేరుకుంది. గత 24 గంటల్లో వరదల కారణంగా 100 మంది తప్పిపోయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సంఘటనల్లో ఇప్పటివరకు 50 మంది గాయపడ్డారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక కొల్హాపూర్ జిల్లాలో 40,882 మంది సహా రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల నుండి కనీసం 89,333 మందిని తరలించారు. కొంకణ్ ప్రాంతంలోని రత్నగిరి జిల్లాలో తీవ్ర వరదలు సంభవించే ప్రదేశమైన చిప్లున్ను ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఆదివారం సందర్శించారు. స్థానికుల బృందం సీఎం కాన్వాయ్ని అడ్డగించింది. వారు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేశారు.
గత 24 గంటల్లో పూణేలో ఒక మరణం సంభవించగా, థానే జిల్లాలో ఒక వ్యక్తి తప్పిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాయ్గడ్లో ఇప్పటివరకు 52, రత్నగిరిలో 21, సతారాలో 13, థానేలో 12, కొల్హాపూర్లో 7, సబర్బన్ ముంబైలో 4, సింధుదుర్గ్, పూణేలో 2 మరణాలు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది.
భారీగా కురిసిన వర్షాల కారణంగా కొల్లాపూర్, సాంగ్లి, సతారా, పూణేలోని మొత్తం 875 గ్రామాలు ప్రభావితమయ్యాయి, 1,35,313 మందిని సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు. రత్నగిరిలోని 6 సహాయ శిబిరాల్లో సుమారు 2 వేల మందిని ఉంచినట్లు ప్రభుత్వం తెలిపింది. చిప్లున్ లోని వశిస్టి నదిపై భారీ వర్షం కురిసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…