మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని ఓ గ్రామంలో వీధులలో మొసలి తిరుగుతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మొసలిని కొంతమంది స్థానికులు గుర్తించారు. రాష్ట్రంలో భారీ వర్షపాతం తరువాత కృష్ణా నదిలో నీటి మట్టం పెరిగి మొసలి నీటి నుండి సులభంగా బయటకు వచ్చినట్లు గుర్తించారు. అయితే ఆ తరువాత ఏమైంది ? అన్న వివరాలు తెలియలేదు.
కాగా కుండపోత వర్షాలు, కొండచరియలు విరిగి పడడం, వరదలతో మహారాష్ట్ర అల్లకల్లోలంగా మారింది. అక్కడ వరదల వల్ల ఎక్కువగా థానే, రాయ్ఘడ్, రత్నగిరి, సతారా, సాంగ్లి, కొల్హాపూర్ జిల్లాలు ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగి పడడం వల్ల మరణించిన వారి సంఖ్య ఆదివారం వరకు 113 కు చేరుకుంది. గత 24 గంటల్లో వరదల కారణంగా 100 మంది తప్పిపోయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సంఘటనల్లో ఇప్పటివరకు 50 మంది గాయపడ్డారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక కొల్హాపూర్ జిల్లాలో 40,882 మంది సహా రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల నుండి కనీసం 89,333 మందిని తరలించారు. కొంకణ్ ప్రాంతంలోని రత్నగిరి జిల్లాలో తీవ్ర వరదలు సంభవించే ప్రదేశమైన చిప్లున్ను ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఆదివారం సందర్శించారు. స్థానికుల బృందం సీఎం కాన్వాయ్ని అడ్డగించింది. వారు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేశారు.
గత 24 గంటల్లో పూణేలో ఒక మరణం సంభవించగా, థానే జిల్లాలో ఒక వ్యక్తి తప్పిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాయ్గడ్లో ఇప్పటివరకు 52, రత్నగిరిలో 21, సతారాలో 13, థానేలో 12, కొల్హాపూర్లో 7, సబర్బన్ ముంబైలో 4, సింధుదుర్గ్, పూణేలో 2 మరణాలు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది.
భారీగా కురిసిన వర్షాల కారణంగా కొల్లాపూర్, సాంగ్లి, సతారా, పూణేలోని మొత్తం 875 గ్రామాలు ప్రభావితమయ్యాయి, 1,35,313 మందిని సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు. రత్నగిరిలోని 6 సహాయ శిబిరాల్లో సుమారు 2 వేల మందిని ఉంచినట్లు ప్రభుత్వం తెలిపింది. చిప్లున్ లోని వశిస్టి నదిపై భారీ వర్షం కురిసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…