మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం హిందువుల ఎన్నో ఆచార వ్యవహారాలు ఎంతో విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే శనివారం రోజు శనిదేవుడికి ప్రతీకగా భావించి శనీశ్వరుడికి పూజలు చేస్తుంటారు. మన పై ఎలాంటి ప్రభావం ఉన్నా.. శని దోషాలు ఉన్న వాటిని నివారణ చేసుకోవడానికి శనివారం శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తాము. శని ప్రభావం మనపై పడకుండా ఉండటం కోసం మనం ఎన్ని పూజలు చేసినా శనివారం మాత్రం పొరపాటున ఈ వస్తువులను కొంటే మన ఇంటికి దరిద్రం కొనితెచ్చుకున్నట్లే అని పండితులు చెప్తున్నారు. మరి శనివారం కొనకూడని వస్తువులు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
శనివారానికి శని దేవుడు అధిపతి కనుక శనివారం రోజు పొరపాటున కూడా ఇనుముతో తయారు చేసిన వస్తువులు ఇంటికి తెచ్చుకోకూడడు. అదేవిధంగా శనివారం ఎలాంటి కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేయకూడదు. వాహనాలను కూడా ఇనుముతోనే తయారు చేసి ఉంటారు కనుక శనివారం కొత్త వాహనాలను కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
శనివారం ఉప్పుని కూడా కొనుగోలు చేయకూడదు.ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి ఉంటుంది కనుక ఉప్పును కొనుగోలు చేయటం వల్ల మన ఇంటి పై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. ఆవనూనెను కూడా శనివారం కొనుగోలు చేయకూడదు. అలాగే కలపతో తయారు చేసిన వస్తువులు, నలుపు రంగు వస్తువులను కూడా శనివారం కొనకూడదు. అలాగే నల్లటి నువ్వులు , నువ్వుల నూనెను కూడా శని వారం ఇంటికి తెచ్చుకోకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…