శనివారం ఈ వస్తువులను కొంటున్నారా.. జాగ్రత్త!

August 7, 2021 12:38 PM

మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం హిందువుల ఎన్నో ఆచార వ్యవహారాలు ఎంతో విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే శనివారం రోజు శనిదేవుడికి ప్రతీకగా భావించి శనీశ్వరుడికి పూజలు చేస్తుంటారు. మన పై ఎలాంటి ప్రభావం ఉన్నా.. శని దోషాలు ఉన్న వాటిని నివారణ చేసుకోవడానికి శనివారం శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తాము. శని ప్రభావం మనపై పడకుండా ఉండటం కోసం మనం ఎన్ని పూజలు చేసినా శనివారం మాత్రం పొరపాటున ఈ వస్తువులను కొంటే మన ఇంటికి దరిద్రం కొనితెచ్చుకున్నట్లే అని పండితులు చెప్తున్నారు. మరి శనివారం కొనకూడని వస్తువులు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

శనివారానికి శని దేవుడు అధిపతి కనుక శనివారం రోజు పొరపాటున కూడా ఇనుముతో తయారు చేసిన వస్తువులు ఇంటికి తెచ్చుకోకూడడు. అదేవిధంగా శనివారం ఎలాంటి కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేయకూడదు. వాహనాలను కూడా ఇనుముతోనే తయారు చేసి ఉంటారు కనుక శనివారం కొత్త వాహనాలను కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.

శనివారం ఉప్పుని కూడా కొనుగోలు చేయకూడదు.ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి ఉంటుంది కనుక ఉప్పును కొనుగోలు చేయటం వల్ల మన ఇంటి పై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. ఆవనూనెను కూడా శనివారం కొనుగోలు చేయకూడదు. అలాగే కలపతో తయారు చేసిన వస్తువులు, నలుపు రంగు వస్తువులను కూడా శనివారం కొనకూడదు. అలాగే నల్లటి నువ్వులు , నువ్వుల నూనెను కూడా శని వారం ఇంటికి తెచ్చుకోకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment